fake software company frauds 100 employees collecting around 40 lakhs in hyderabad | Jobs: ఉద్యోగాలిస్తామని డబ్బులు వసూలు.. బోర్డు తిప్పేసిన సాఫ్ట్‌వేర్ కంపెనీ
fake
క్రైమ్

Jobs: ఉద్యోగాలిస్తామని డబ్బులు వసూలు.. బోర్డు తిప్పేసిన సాఫ్ట్‌వేర్ కంపెనీ

Fraud: గచ్చిబౌలిలో బడా సాఫ్ట్‌వేర్ డెవలపర్ కంపెనీగా పోజు ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఐదు బ్రాంచీలు పెట్టారు. ఉద్యోగాలు ఇస్తామని, అయితే డిపాజిట్ ఫీజులు ఇవ్వాలని నిరుద్యోగులకు గాలం వేశారు. ఈ కంపెనీ వ్యవహారాలు, బ్రాంచీలు చూసి కొందరు నిరుద్యోగులు నిజమనే నమ్మారు. డబ్బులు ముట్టజెప్పారు. కోట్ల రూపాయలు వసూలయ్యాక ఆ కంపెనీ బోర్డు తిప్పేసింది. కంపెనీ క్లోజ్ చేశామని చల్లగా కబురు చెప్పారు. బాధితులు రాయదుర్గ్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

రైల్ వరల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఈ కంపెనీ దేశ వ్యాప్తంగా ఐదు బ్రాంచీలు పెట్టింది. ఇందులో ఒకటి మూడు నెలల క్రితం గచ్చిబౌలిలోనూ పెట్టింది. ఉద్యోగాలు ఇస్తామని ఒక్కొక్కరి వద్ద నుంచి 40 వేల నుంచి 50 వేల రూపాయలు తీసుకుంది. వీటిని సెక్యూరిటీ డిపాజిట్లుగా చెప్పి నమ్మించింది. ఒక్క గచ్చిబౌలిలోనే రూ. 40 లక్షల వరకు డబ్బు వసూలు చేసింది. మొత్తంగా 800 మంది దగ్గర సెక్యూరిటీ డిపాజిట్లు వసూలు చేసింది. మొత్తం రూ. 5 కోట్ల వరకు డబ్బులు వసూలయ్యాక బోర్డు తిప్పేసింది. కంపెనీ క్లోజ్ చేశామని యాజమాన్యం షాక్ ఇచ్చింది.

కంపెనీ మోసంతో హైదరాబాద్‌లో 100 మంది ఉద్యోగులు నష్టపోయారు. వారు రాయ్‌దుర్గం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?