fake
క్రైమ్

Jobs: ఉద్యోగాలిస్తామని డబ్బులు వసూలు.. బోర్డు తిప్పేసిన సాఫ్ట్‌వేర్ కంపెనీ

Fraud: గచ్చిబౌలిలో బడా సాఫ్ట్‌వేర్ డెవలపర్ కంపెనీగా పోజు ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఐదు బ్రాంచీలు పెట్టారు. ఉద్యోగాలు ఇస్తామని, అయితే డిపాజిట్ ఫీజులు ఇవ్వాలని నిరుద్యోగులకు గాలం వేశారు. ఈ కంపెనీ వ్యవహారాలు, బ్రాంచీలు చూసి కొందరు నిరుద్యోగులు నిజమనే నమ్మారు. డబ్బులు ముట్టజెప్పారు. కోట్ల రూపాయలు వసూలయ్యాక ఆ కంపెనీ బోర్డు తిప్పేసింది. కంపెనీ క్లోజ్ చేశామని చల్లగా కబురు చెప్పారు. బాధితులు రాయదుర్గ్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

రైల్ వరల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఈ కంపెనీ దేశ వ్యాప్తంగా ఐదు బ్రాంచీలు పెట్టింది. ఇందులో ఒకటి మూడు నెలల క్రితం గచ్చిబౌలిలోనూ పెట్టింది. ఉద్యోగాలు ఇస్తామని ఒక్కొక్కరి వద్ద నుంచి 40 వేల నుంచి 50 వేల రూపాయలు తీసుకుంది. వీటిని సెక్యూరిటీ డిపాజిట్లుగా చెప్పి నమ్మించింది. ఒక్క గచ్చిబౌలిలోనే రూ. 40 లక్షల వరకు డబ్బు వసూలు చేసింది. మొత్తంగా 800 మంది దగ్గర సెక్యూరిటీ డిపాజిట్లు వసూలు చేసింది. మొత్తం రూ. 5 కోట్ల వరకు డబ్బులు వసూలయ్యాక బోర్డు తిప్పేసింది. కంపెనీ క్లోజ్ చేశామని యాజమాన్యం షాక్ ఇచ్చింది.

కంపెనీ మోసంతో హైదరాబాద్‌లో 100 మంది ఉద్యోగులు నష్టపోయారు. వారు రాయ్‌దుర్గం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Just In

01

Gold Kalash robbery: మారువేషంలో వచ్చి జైనమత ‘బంగారు కలశాలు’ కొట్టేశాడు

Director Krish: ‘హరి హర వీరమల్లు’ విషయంలో చాలా బాధగా ఉంది

Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్