Dinosaurs: సుమారు 65 మిలియన్ల ఏళ్ళ క్రితం ఈ భూమిని ఒకే ఒక్క జీవి పాలించేది. అది 40 నుంచి 200 అడుగులు ఎత్తు మరియు 4 నుంచి 150 టన్నుల బరువు కలిగి చూడటానికే భయంకరంగా ఉండేది. వాటినే మనం డైనోసర్లు అని పిలిస్తున్నాం. ఇవి ఈ భూమి మీద దాదాపు 165 మిలియన్ల సంవత్సరాలు అంటే 65 కోట్ల ఏళ్లు జీవితం గడిపాయి. కానీ, 6 కోట్ల క్రితం ఈ భూమి మీద జరిగిన విస్ఫోటనం కారణంగా డైనోసర్స్ అంతరించి పోయి మనం మనుషులు పుట్టుకొచ్చాము. అసలు ఆ చివరి రోజు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మనం ఆ సంఘటనలను దగ్గర నుంచి పరిశీలించాలి.
ఆ కాలంలో డైనోసర్లు అత్యంత పెద్ద జీవులు. అలాగే, డైనోసర్స్ తో పాటు ఈ భూమి మీద మరొక జీవి కూడా నివసిస్తుంది. అది చూడటానికి ఎలుక లాగా ఉంది. దాని పేరు మమ్మెల్. దీని వలనే ఈ రోజున మనం పుట్టాము. ఇవి డైనోసర్లను చూసి భూమి అడుగు బాగానా వాటి జీవనాన్ని కొనసాగించాయి. అయితే, ఇవి అలా భయపడి భూమి కింద అవి బతకటం వలన ఒక అద్భుతం జరిగింది. డైనోసర్లు చాలా సంతోషంగా బతుకుతున్నాయి, ఆ రోజున కొన్ని గంటల్లో పెను ప్రమాదం జరిగి అవి అంతరించి పోతాయని వాటికీ తెలియదు. 10 కిలో మీటర్ల ఉన్న ఒక గ్రహశకలం మన భూమి మీదకు చాలా వేగంగా దూసుకువస్తుంది. కొద్దీ సేపటికి ఆ గ్రహశకలం మన భూమిని చేరుకొని, దాని కారణంగా ఆ గ్రహశకలం గంటకి 70 వేల కిలోమీటర్ల వేగంతో గంటకి 70 వేల కిలోమీటర్ల వేగంతో ఒక అగ్ని గోళంలా.. ఏంతో కాంతి వంతంగా భూమి పైకి దూసుకు వచ్చింది.
ఆ భయంకరమైన అగ్ని గోళం నుంచి వచ్చిన కాంతి ఎంత ప్రకాశవంతంగా ఉందంటే.. దీని చుట్టూ పక్కల 800 కిలోమీటర్ల రేడియస్ దూరంలో ఉన్న అన్ని జీవులకీ కళ్ళు కనిపించకుండా పోయాయి. ఈ భారీగా ఉన్న డైనోసర్లకి కళ్ళు అసలు కనిపించకుండా పోయాయి. కొన్ని క్షణాల్లోనే ఈ భూమి మీద మెక్సికో ప్రాంతాన్ని గ్రహశకలం ఢీ కొట్టింది. దీని వలన పెద్ద విస్ఫోటనమే జరిగింది. ఆకాశం మొత్తం పెద్ద ధూళి, మేఘాలతో కప్ప బడి పోయాయి. దీని కారణంగా భూమి పై నివసిస్తున్న కొన్ని లక్షల ప్రాణులు చనిపోయాయి. కానీ, ఆకాశంలో తిరుగుతున్న ఎగిరే డైనోసర్లు ఇంకా బతికే ఉన్నాయి. అయితే, విస్ఫోటనమే జరిగిన 40 నిముషాల తర్వాత మన భూమి యొక్క గ్రావిటేషన్ కారణంగా పైకి వెళ్లిన మేటర్ మళ్లీ అగ్ని గోళాలలుగా మారి, ఈ భూమి పైన వర్షం రూపంలో పడ్డాయి. దీని కారణంగా ఆకాశంలో ఎగురుతున్న డైనోసర్లు కూడా చనిపోయాయి. ఆ తర్వాత గంటకి 6 వేల కిలో మీటర్ల వేగంతో గాలి, దట్టమైన మేఘాలు భూమి మొత్తాన్ని కప్పేశాయి.
