Harish Rao ( image credit: twitter)
తెలంగాణ

Harish Rao: వారం రోజుల్లో తెలంగాణకు గల్ఫ్ కార్మికులు.. కంపెనీలను ఒప్పించిన హరీష్ రావు

Harish Rao: తెలంగాణకు వారం రోజుల్లో 12 మంది గల్ఫ్ కార్మికులు రానున్నారు. ‘కుటుంబాలను పోషించేందుకు జోర్డాన్ వెళ్లాం కానీ ఇప్పుడు స్వదేశానికి తిరిగి వచ్చే మార్గమే కనిపించట్లేదు మమ్మల్ని కాపాడండి’ అని వాట్సాప్ మెసేజ్ వారికి దారి చూపింది. బీఆర్ఎస్ పార్టీ రూపంలో తెలంగాణకు చేరుకునేందుకు బాటలు వేసింది. తెలంగాణ గల్ఫ్ కార్మికుల గోడును విన్న మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao)పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలతో 12 మందిని ఎలాగైనా రప్పించాలని నిశ్చయించుకున్నారు. వారి స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని తన కార్యాలయానికి సూచించారు. 12 మందికి స్వయంగా తానే ఫోన్ చేసి ‘ధైర్యంగా ఉండండి ఎట్లయినా మిమ్మల్ని తెలంగాణకు తీసుకువస్తాం’ అని భరోసా ఇచ్చారు.

Also ReadHarish Rao: ఆరు గ్యారెంటీలు అమలవ్వాలంటే.. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ను ఓడించాలి.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

బండి సంజయ్ సహా మీడియా దృష్టికి తీసుకువెళ్లిన

ఒకవైపు జోర్డాన్ గల్ఫ్ కార్మికుల సమస్యను రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహా మీడియా దృష్టికి తీసుకువెళ్లిన హరీశ్ రావు, మరోవైపు బీఆర్ఎస్ ఎంపీ సురేశ్ రెడ్డి ద్వారా భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లారు. ఇంకోవైపు సంబంధిత కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ క్రమంలో పెనాల్టీ చెల్లించి వారిని తెలంగాణకు తీసుకువెళ్లవచ్చు అని కంపెనీ చెప్పగా దానికి అంగీకరించారు. గల్ఫ్ కార్మికుల ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా చెల్లించాల్సిన మొత్తంతో పాటు, స్వదేశానికి రావడానికి అయ్యే విమాన టికెట్లను సైతం స్వయంగా హరీశ్ రావు భరించారు.

12 మంది గల్ఫ్ కార్మికులు 

దీంతో విమాన టికెట్ల బుకింగ్ ప్రక్రియ సైతం పూర్తయింది. మరో వారంలో నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, జగిత్యాల, సిద్దిపేట లకు చిందిన 12 మంది గల్ఫ్ కార్మికులు తెలంగాణ కు రానున్నారు. సుదీర్ఘ కాలం ఎదురుచూపుల తర్వాత వారి కుటుంబాలను కలుసుకోబోతున్నారు. 12 మంది కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు. త్వరలో స్వదేశానికి రాబోతున్నాం, కుటుంబ సభ్యులను కలుసుకోబోతున్నామని జోర్డాన్ లో ఉన్న గల్ఫ్ కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తుండగా, మరోవైపు తమ వారు సొంతూళ్లకు రాబోతున్నారని వారి కుటుంబ సభ్యులు సంతోపడుతున్నారు.

నేడు మల్లా మొదలు: మాజీ మంత్రి హరీశ్ రావు

జోర్డాన్ లో చిక్కుకున్న 12 మంది తెలంగాణ గల్ఫ్ కార్మికులను తిరిగి స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేసీఆర్ ఆదేశాలతో అన్ని విధాలుగా ఏర్పాటు చేశాం. వారం రోజుల్లో ఇక్కడకు చేరుకుంటారు. ఇది నాకెంతో సంతృప్తిని కలిగిస్తున్నది. అభివృద్ది, సంక్షేమం సమ ప్రాధాన్యంగా సాగిన కేసీఆర్ పాలనలో వలసలు వాపస్ అయితే, రేవంతు 22 నెలల పాలనలో వలసలు మల్లా మొదలయ్యాయి. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసినట్లుగానే, గల్ఫ్ కార్మికులను సైతం కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. అభయహస్తం మేనిఫెస్టోలో చెప్పిన గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల సంక్షేమ బోర్డు ఇప్పటికీ అతీగతీ లేదు. కనీసం టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నాం.

Also Raed:Harish Rao: టూరిజం అభివృద్ధి పేరుతో సర్కార్ స్కాం.. మంత్రి హరీశ్ సంచలన కాామెంట్స్! 

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!