Flight ( Image Source: Twitter )
Viral

Missing Flight: ఆకాశంలో మాయమైన విమానం.. 35 ఏళ్ల తర్వాత ల్యాండింగ్?

Missing Flight: సాధారణంగా తప్పిపోయినవి తిరిగి రావడం అంటే అది మాములు విషయం కాదు. అక్కడ ఏదైనా మాయ జరిగే ఉంటుందని నమ్ముతారు. అయితే, ఈ ఘటన శాస్త్రవేత్తలకు కూడా సవాల్ విసురుతుంది. తప్పిపోయిన విమానం తిరిగి వచ్చింది. కానీ, దానిలో ఒక్క మనిషి కూడా లేరు. అన్నీ అస్థి పంజరాలే ఉన్నాయి. ఇది పాత వార్తే అయినప్పటికీ ప్రస్తుతం, సోషల్ మీడియాలో మళ్ళీ వైరల్ గా మారింది. అసలు, ఈ ఘటన ఎలా జరిగిందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..

ఒక విమానం 35 ఏళ్ళ తర్వాత తిరిగి భూమి మీద ల్యాండ్ అయింది. ఆ తర్వాత దాని లోపలికి వెళ్ళి చూసిన వాళ్ళకి భయంతో చెమటలు పట్టాయి. అన్ని అస్థి పంజరాలే ఉన్నాయి.  4 సెప్టెంబర్ 1954 లో శాంటియాగో ఎయిర్ లైన్స్ కి చెందిన EWA 513 విమానం జర్మనీ నుంచి బ్రెజిల్ కు టేక్ ఆఫ్ అయింది. ఇది కంప్లీట్ కావడానికి కేవలం 18 గంటలు సమయం మాత్రమే పడుతుంది.

కానీ, అది ఆకాశంలోకి ఎగరగానే ఒక గంట తర్వాత, ఆ ఫ్లైట్ సిగ్నల్స్ పూర్తిగా డిస్ కనెక్ట్ అయిపోయాయి. 92 మందితో కూడిన ఆ ఫ్లైట్ ఎప్పుడూ కనిపించలేదు. కానీ, 35 ఏళ్ళ తర్వాత 12 అక్టోబర్ 1989 లో అదే ప్లాట్ ఫార్మ్ పైన ఒక ఫ్లైట్ ల్యాండ్ అయింది. దాన్ని చూసిన ప్రతి ఒక్కరూ ల్యాండ్ అయ్యారు. 35 ఏళ్ల కిందట తప్పిన పోయిన ఫ్లైట్ మళ్ళీ ఇప్పుడు కనిపించడంతో అక్కడున్న వారందరూ కూడా షాక్ అయ్యారు.

ఆగిఉన్న ఫ్లైట్ లోకి వెళ్ళి చూస్తే దానిలో 92 ఆస్థి పంజరాలు ఉన్నాయి. ఇక్కడ అందరికీ అర్ధం కానీ విషయం ఏమిటంటే.. ఒక అస్థి పంజరం ఫ్లైట్ ను ఎలా కంట్రోల్ చేస్తుంది? దానికి అంత శక్తీ ఉండదు? అసలు ప్రాణమే లేని అస్థి పంజరం అంత దూరం ఎలా నడిపింది. దీనిని ఎలా అయినా ఛేదించాలని చాలా మంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి నమ్మలేని నిజాలను బయట పెట్టారు. ఆకాశంలో వెళ్లిన ఈ విమానం టేక్ ఆఫ్ అయిన తర్వాత టైం లో చిక్కుకుని టైమ్ ట్రావెల్ లోకి ప్రవేశించి తిరిగి వచ్చిందని చెబుతున్నారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!