Rangareddy (IMAGE CREDIT: SWETCHA REPORTER)
తెలంగాణ, నార్త్ తెలంగాణ

Rangareddy: ఆ జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా ఫామ్​ హౌస్​.. ఆన్లైన్ బుకింగ్ ద్వారా అక్రమ వ్యాపారం!

Rangareddy: పుట్టిన రోజు పెళ్లి రోజుల పేరుతో నగర శివారులో యువత జోరుగా జల్సాలు చేసుకుంటున్నారు. ఈ జల్సాలకు మోయినాబాద్​ మండలం అడ్డగా మారిపోయింది. గత మూడు నెలలో మద్యం, మత్తు సేవిస్తూ యువతి యువకులు పోలీసులకు పట్టుబడిన సంఘటనలున్నాయి. అయినప్పటికి యువతి, యువకులు జల్సాలు తగ్గించుకునేందుకు ఇష్టపడటం లేదు.

ఆ జల్సాలు కొనసాగించేందుకు ఎంత దూరమైన యువకులు ఆరాటపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మత్తు పదార్ధాలను నిర్మూలించాలని కంకణం కట్టుకొని పనిచేస్తుంది. అయినప్పటికి యువతలో మార్పు కనిపించడం లేదు. ఏలాగైన మత్తుతో ఎంజాయ్​ చేయాలనే ఆలోచనతో అక్రమ పద్దతికి మార్గాలను యువత వెతుకుంటుంది. అందులో భాగంగానే రంగారెడ్డి (Rangareddy) జిల్లా మొయినాబాద్​ మండల పరిధిలోని ఓ ఫామ్​ హౌస్​ పై ఎస్​వోటీ పోలీసులు (Police)  దాడి చేశారు.

 Also Read: MLA Kadiyam Srihari: అభ్యర్థుల ఎంపిక మీదే గెలిపించే బాధ్యత మీదే: కడియం శ్రీహరి

యాజమాని వ్యాపారం కోసం ఆన్‌లైన్ బుకింగ్

ఫామ్​హౌస్​ యాజమాని వ్యాపారం చేసేందుకు వేరే మార్గం లేక యువతను ఆసరా చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ సూచనలను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా ఫామ్​ హౌస్​లను యాజమాన్యం నడిపిస్తుంది. బహిరంగంగా కాకుండా ఆన్‌లైన్ పద్దతిలో ఫామ్​ హౌస్​ బుకింగ్​కి అవకాశం కల్పిస్తున్నారు. అంతేకాకుండా యువతను ఆకర్షించేందుకు పార్టీలను ప్లానింగ్​ ఇస్తున్నట్లు తెలుస్తోంది. దూరపు కొండలు నునుపు అన్న చందంగా యువత ముందు వెనుక ఆలోచించకుండా ఫామ్​ హౌస్​లను బుకింగ్​ చేసుకోని పోలీసులకు దోరికిపోతున్నారు. ఒకో వ్యక్తికి రూ1300 ఫీజు చెల్లిస్తే అన్ని హంగులతో ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆన్​లైన్​లో వివరించారు. బాధ్యతయుతగల పౌరులు తప్పుడు పద్దతులను ప్రోత్సహించడం చట్టరిత్య నేరం. అయినప్పటికి ఇవేవి పట్టించుకోకుండా ఫామ్​ హౌస్​ యాజమాన్యం ధనర్జానే ధ్యేయంగా పనిచేయడం సిగ్గు చేటు.

మైనర్లు సైతం డ్రగ్స్​కు బానిస

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని పెద్ద  గ్రామ శివారులోని చెర్రీ ఓక్స్​ ఫామ్​ హౌస్​పై ఆదివారం రాత్రి ఎస్​వోటీ పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడిలో సుమారు 50 మంది వరకు యువతి, యువకులు ఉన్నట్లు సమాచారం. వీరందరూ పార్టీ చేసుకుంటూ పోలీసులకు పట్టుబడినట్లు తెలుస్తోంది. ఈవిషయం గుట్టు చప్పుడు కాకుండా ముగించాలని పోలీసులు అభిప్రాయ పడ్డట్లు అనుమానం. పట్టుబడిన యువతకు నార్కోటిక్​ పరీక్షలు జరపగా మద్యం, డ్రగ్స్​ సేవించినట్లు తెలుస్తోంది. ఇద్దరు గంజాయి తీసుకున్నట్లు నిర్ధారణ అయినట్లు ప్రచారం సాగుతుంది. ఈ పార్టీలో అత్యధిక మంది మైనర్​ యువత పాల్గోన్నట్లు సమాచారం. ఇప్పటికి పోలీసులు సమాచారం గోప్యంగా ఉంచడంతో పలు అనుమానాలకు తావునిస్తోంది.

 Also ReadOG Collections: విధ్వంసం.. ‘ఓజీ’ మూవీ 11 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ మొత్తం ఎంతంటే?

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!