New Liquor Shops: రాష్ట్రంలో కొత్త వైన్ షాపుల కోసం గురువారం నోటిఫికేషన్ జారీ అయ్యింది. నేటి నుంచి అక్టోబర్ అక్టోబర్ 18వ తేదీ వరకు తీసుకోనున్నారు. ఆ తరువాత అయిదు రోజులకు ఆయా వైన్ షాపులను ఎవరెవరికి కేటాయించాలన్న దానిపై రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో లాటరీ నిర్వహించనున్నారు. ఇక, షాపులను దక్కించుకున్న వారు అక్టోబర్ 23, 24వ తేదీల్లో లైసెన్స్ ఫీజులోని మొదటి వాయిదాను చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి కొత్త షాపులను తెరుచుకోవచ్చు.
2027, నవంబర్ 30వ తేదీ వరకు లైసెన్స్ కాలపరిమితి ఉంటుంది. ఇక, దరఖాస్తు రుసుమును 3లక్షల రూపాయలుగా నిర్ణయించారు. ఇక, లైసెన్స్ ఫీజు మొత్తాన్ని ఒకేసారి కాకుండా ఆరు వాయిదాల్లో చెల్లించే వెసులుబాటును కల్పించారు. 1968 ఎక్సయిజ్ చట్టం ప్రకారం కేసుల్లో శిక్షలు పడిన వారు వైన్ షాపులు పొందటానికి అనర్హులు. రాష్ట్రంలో మొత్తం 2,620 వైన్ షాపులు ఉండగా వీటిలో గౌడ్ లకు 15శాతం, ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు 5శాతం కేటాయించారు.
Also Read: Jagapathi Babu: రూ. 800 కోట్ల మోసం.. ఈడీ విచారణకు జగపతి బాబు
హైదరాబాద్ జిల్లాలో కొత్త మద్యం షాపుల కేటాయింపులు ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలతోనే కేటాయింపులు జరపాలన్న జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి ఆదేశాల మేరకు డ్రా పద్దతి ద్వారా షాపులు కేటాయింపులు చేపట్టడం జరిగిందని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటాచారి తెలిపారు. కలెక్టరేట్ లోని వీడియోకాన్ఫరెన్స్ హాల్ లో హైదరాబాద్ జిల్లా పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్లలో ఎస్సీ, ఎస్టీ, గౌడ్, జరనల్ కోటాలలో టోకెన్ సిస్టం ద్వారా డ్రా పద్ధతిని ఎక్సైజ్ సూపరిండెంట్ ఎస్. పంచాక్షరి, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్ ఎన్. శ్రీనివాసరావు లతో కలసి పాల్గొని డ్రా నిర్వహించినట్లు తెలిపారు.
Also Read: CM Revanth Reddy: తమిళనాడు మోడల్లో తెలంగాణ విద్యా రంగం.. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
మొత్తం 82 షాపులు కేటాయించడం జరిగింది
హైదరాబాద్ డివిజన్ పరిధిలోని ఎస్సీలకు 4 షాపులు, ఎస్టీలకు ఒకటి, గౌడ్ లకు 5, అలాగే జనరల్ కేటగిరీలో 72 షాపులతో కలిపి మొత్తం 82 షాపులు కేటాయించడం జరిగిందని తెలిపారు. అలాగే సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని ఎస్సీలకు 7 షాపులు, ఎస్టీలకు ఒకటి, గౌడ్ లకు 6 అలాగే, జనరల్ కేటగిరీలో 83 షాపులతో కలిపి మొత్తం 97 షాపుల కేటాయింపులు జరిగినట్లు వెల్లడించారు. ఈ డ్రా పద్ధతిని ఎస్సీ,ఎస్టీ సంక్షేమ అధికారులు, ఎక్సైజ్ అధికారుల సమక్షంలో నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ అధికారులు ప్రవీణ్ కుమార్, కోటాజి, ఎక్సైజ్ అధికారులు తదితరలు పాల్గొన్నారు.
Also Read: Bathukamma Kunta: బతుకమ్మ కుంట గ్రాండ్ ఓపెనింగ్.. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఉత్సవాలు
వైన్ షాపులకు రిజర్వేషన్లు ఖరారు
వైన్స్ షాపులకు టెండర్లకు నోటీఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అందులో భాగంగా జనగామ జిల్లాలోని 12 మండలాల్లో 50 వైన్స్ షాపులకు నోటీఫికేషన్ వేశారు. గురువారం కలెక్టర్ పింకేష్ కుమార్ ఆధ్వర్యంలో రిజర్వేషన్లకు ఖరారు చేశారు. ఇంతకు ముందు జనగామ జిల్లాలో వైన్షాపులు 47 ఉండగా, కొత్తగా మరో మూడు వైన్షాపులు పెరిగాయి. జనగామ పట్టణంలో ఒకటి, స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి మండల కేంద్రాల్లో ఒక్కోక్క షాపు చొప్పున పెరిగాయి. ఈ షాపులకు ఈనెల 26 నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తుల స్వీకరించనున్నారు. అక్టోబర్ 23న జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో డ్రా పద్ధతిలో షాపుల కేటాయింపు చేస్తారు.
కొత్త షాపుల ప్రారంభం
గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కేటాయింపు చేస్తూ రాష్ట్ర ఎక్సైజ్ అధికారులు నిర్ణయించారు. టెండర్ ఫీజు రూ.3 లక్షలుగా నిర్ణయించడంతో ఆశావాహుల్లో కొంత ఆందోళన ఉంది. ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి కొత్త షాపుల ప్రారంభం అవుతుండగా, 2027 నవంబర్ 30 వరకు లైసెన్స్ కాలపరిమితి ఉంటుందని తెలిపారు. 6 శ్లాబుల ద్వారా లైసెన్స్లు జారీ చేయనున్నారు. అయితే జిల్లాలో జనగామ, స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి ఎక్సైజ్ సర్కిల్స్ ఉన్నాయి. మూడు సర్కిళ్ళ పరిధిలో అదనంగా మూడు షాపులు పెరగడంతో ఎక్సైజ్ శాఖకు మరింత ఆదాయం చేకూరనున్నది. గౌడ కులస్తులకు 13షాపులను, ఎస్సీలకు 5షాపులను, ఎస్టీలకు ఒక షాపును రిజర్వేషన్లు కలెక్టర్ కేటాయించారు.
గౌడ్ లకు షాపు నెంబర్ 2, 4, 6, 8, 15, 17, 18, 23, 26, 31, 39, 40, 49 లను, ఎస్సీలకు షాపు నెంబర్ 11, 13, 22, 35, 36, ఎస్టీలకు షాపు నెంబర్ 30లను కెటాయించారు. రిజర్వేషన్ల కెటాయింపు ప్రక్రియలో జిల్లా ప్రోహిబిషన్, ఎక్సైజ్ జిల్లా అధికారి కె.అనిత, గిరిజన అభివృద్ధి జిల్లా అధికారి ఆర్.ప్రేమకళ, బీసీ సంక్షేమ జిల్లా అధికారి ఎన్ ఎల్ నర్సింహారావు, ఎస్సీ అభివృద్ధి జిల్లా అధికారి బి. విక్రం, ప్రొహిబిషన్, ఎక్సైజ్ జిల్లా అసిస్టెంట్ సూపరిండెంట్ ఆర్. ప్రవీణ్, పాలకుర్తి ఎక్సైజ్ సీఐ సంతోష్రెడ్డి పాల్గొన్నారు.
Also Read: Balakrishna Controversy: బాలకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలి- అఖిల భారత చిరంజీవి యువత
