Land Scam: తహసీల్దార్ బదిలీ తర్వాత వెలుగులోకి వచ్చిన ఘటన
Land Scam ( Image Source: Twitter)
Telangana News

Land Scam: భూములకు పట్టా ఆశ చూపి లక్షలు నొక్కేశారు.. వెలుగులోకి వచ్చిన తహసీల్దార్ దోపిడి

Land Scam: సింగరేణి మండలంలో సాగులో ఉన్న భూములకు భూయాజమన్య పట్టా పాసు పుస్తకం లేక ఇబ్బంది పడుతున్న పలువురు ఆమాయక గిరిజన రైతులకు పట్టా పాసుపుస్తకం ఆశ చూపి లక్షలు నొక్కేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో సాక్ష్యాత్తు రెవెన్యూ శాఖ అధికారులే డబ్బులు తీసుకుని చేతులెత్తేశారు. మధ్యవర్తి ద్వారా మండల రెవెన్యూ అధికారి(తహసిల్దార్)ను నమ్మి డబ్బులిచ్చిన బాధిత రైతులు మాత్రం పట్టా పాసుపుస్తకం రాక, రెక్కల కష్టంతో సంపాదించిన డబ్బులు కూడా పోగొట్టుకుని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Mirai Box Office Collections: స్టార్ హీరోలకి చుక్కలు చూపిస్తోన్న తేజ సజ్జా.. సెకండ్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?

వివరాల్లోకి వెళితే.. గతంలో సింగరేణి మండల ఎమ్మార్వోగా పనిచేసిన క్రమంలో విఆర్ఏ ముత్తయ్య మనవడు కోటేశ్వరరావు ద్వారా సూర్యతండా, భాగ్యనగర్ తండాకు చెందిన 15మంది రైతుల వద్ద నుండి సుమారు రూ.2లక్షలు వసూలు చేశారు. మిస్సింగ్ సర్వేనెంబర్ అనే పేరుతో మీసేవ కేంద్రం ద్వారా పట్టాల కోసం దరఖాస్తు కూడా సమర్పించారు. ఓ ప్రైవేట్ సర్వేయర్ ద్వారా రైతుల భూములకు నామమాత్రంగా సర్వే కూడా చేయించి రైతులను నమ్మించారు.

Also Read: Bigg Boss 9 Telugu: ఫస్ట్ వీక్ ఎలిమినేషన్.. వైరల్ అవుతున్న నాగార్జున, శ్రష్ఠి వీడియో.. ఎలిమినేట్ చేశారా లేక బయటకు రప్పిస్తున్నారా?

తొమ్మిది నెలల గడిచిన కూడా పట్టా పాసుపుస్తకాలు రాకపోగా, హామీ ఇచ్చిన ఎమ్మార్వో కూడా బదిలీపై మహబూబాబాద్ జిల్లా ఓ మండలానికి వెళ్లిపోవడంతో డబ్బులిచ్చి పట్టా పాసు పుస్తకాలపై ఆశలు పెట్టుకున్న బాధిత రైతులు ఆందోళన చెంది విషయాన్ని బయటకు చెప్పారు. రైతులు మధ్యవర్తి కోటేశ్వరరావును డబ్బులు ఇవ్వమని ఒకటికి పది సార్లు అడుగుతున్న ప్రతిసారి ఎమ్మార్వో పై నెట్టివేస్తూ,కొన్ని రోజులు ఆగితే మీ డబ్బులు మీకు తిరిగి ఇస్తామని చెబుతూ కాలయాపన చేస్తున్నారు.

Also Read: Shankarpally Robbery Case: శంకర్‌పల్లి దారి దోపిడీ కేసు.. సంచలన విషయలు వెలుగులోకి? ఏం నటించాడు భయ్యా!

ఈ తాసిల్దార్ సింగరేణి మండలంలో పనిచేసిన సమయంలో ఎన్నో రకాల అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో పెద్ద మనుషులు కూడా తల దూర్చి సెటిల్మెంట్ చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్లు సమాచారం. ఫోన్ లైన్లో గత ఎమ్మార్వో తో మాట్లాడే ప్రయత్నం చేసిన అందుబాటులోకి రాలేదు.

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..