Gandipeet land kabja
క్రైమ్

Hyderabad:ప్రభుత్వ భూమికి ‘గండి’కొట్టిన బీఆర్ఎస్ నేత

Gandipeta government land illigally occupaied brs leader:
కొంతమంది భూబకాసురులు ఒక స్థలం పై గురి పెట్టారంటే ఎన్ని ఎత్తుగడలు వేసైనా తమ వశం అయ్యేంత వరకు పట్టువదలని విక్రమార్కుల్లా ఎంతకైనా తెగిస్తారు అనేందుకు మచ్చుకు ఉదాహరణ ఇది. రంగారెడ్డి జిల్లా గండిపేటలో కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జా గురైంది. బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్ పరిధిలోని గంధంగూడ సర్వే నెంబర్ 51లో 9 ఎకరాల 36 గుంటల భూమిని బీఆర్ఎస్ పార్టీ లీడర్ కబ్జా చేసినట్టు సమాచారం. కబ్జా చేసిన భూములకు పట్టా పాస్ బుక్కులు సంపాదించినట్టు తెలుస్తుంది. అప్పటి బీఆర్ఎస్ మంత్రి సహకారంతో కలెక్టర్ ను ప్రభావితం చేసి అడ్డదారిన పట్టా పాస్ బుక్కులు పొందినట్టు సమాచారం.

తహశీల్దార్ అండతో..

కబ్జా చేసిన కోట్ల రూపాయల విలువ చేసే భూమిని గండిపేట తహశీల్దార్ కాపాడారని స్థానికులు గుసగుసలాడుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన రెవెన్యూ శాఖ అధికారులు జేసీబీ సహాయంతో ప్రహరీ గోడను నేలమట్టం చేశారు. అడ్డదారిని సంపాదించిన పట్టా పాస్ బుక్కులను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శషాంకా క్యాన్సెల్ చేశారు. దీనిపై విచారణ జరిపి నిందితుడిని అదుపులోకి తీసుకుంటామని చెప్పారు రెవెన్యూ అధికారులు.

Just In

01

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం

Crime News: దుస్తులు లేకుండా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?