Jaishankar Bhupalpally ( Image Source: Twitter)
తెలంగాణ

Jaishankar Bhupalpally: పాఠశాలలోకి భారీగా చేరిన వరద నీరు..

 Jaishankar Bhupalpally: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా మండలంలోని గొల్ల బుద్ధారం ప్రభుత్వ పాఠశాలలోకి భారీగా వరద నీరు చేరింది. దీనివల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాల ప్రాంగణంలోకి నీరు చేరడంతో తరగతి గదులు, ఆవరణ బురదమయంగా మారాయి. పాఠశాల ఎదురుగా ఉన్న కల్వర్టులో పేరుకుపోయిన చెత్త, చెదారం, మొక్కలను గ్రామ పంచాయతీ సిబ్బంది తొలగించకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Also Read: Gadwal District Collector: ఉపాధ్యాయుడిగా మారిన కలెక్టర్.. విద్యార్థులకు పాఠాలు ఉపాధ్యాయులకు సూచనలు

దీనివల్ల పాఠశాల ముందున్న కుంట నుంచి వరద నీరు నేరుగా పాఠశాలలోకి వస్తుందని, ఈ సమస్య ప్రతి సంవత్సరం పునరావృతమవుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి, పాఠశాలలోకి నీరు రాకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. వర్షాల వల్ల విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా చూడాలని, త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

Also Read: Vijay Sethupathi: విజయ్ సేతుపతికి ఆ కోరిక తీరిస్తేనే అమ్మాయిలకు సినిమాలో ఛాన్స్ ఇస్తాడా.. నిజాలు బయటపెట్టిన డైరెక్టర్?

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?