Konda vs Warangal Leaders: వరంగల్ వివాదంపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ మరోసారి భేటీ అయింది. ఎంపీ మల్లు రవి(Mallu Ravi) అధ్యక్షతన సుమారు రెండు గంటల పాటు ఈ మీటింగ్ జరిగింది. కొండా మురళి(Konda Murali) నుంచి కమిటీ సభ్యులు అభిప్రాయాన్ని సేకరించారు. ఈ వివాదానికి పుల్ స్టాఫ్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్న క్రమ శిక్షణ కమిటీ ఉమ్మడి వరంగల్(Warangal) ఎమ్మెల్యేలు, కొండా ఫ్యామిలీకి తగిన సలహాలు, సూచనలను సూచించింది. ఈ సందర్భంగా మల్లు రవి(Mallu Ravi) మాట్లాడుతూ, ఉమ్మడి వరంగల్ జిల్లా(Warangal District) నేతల వివాదాలపై చర్చించామన్నారు.
Also Read: Khammam District: పౌరులకు రాజ్యాంగ విద్య అందించాలి.. సీపీఎం నేత కీలక వ్యాఖ్యలు
సమిష్టిగా పని చేయాలి
భవిష్యత్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో నేతలంతా సమిష్టిగా పని చేయాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. ఇక అనిరుధ్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి(Rajagopal Reddy) అంశాలను చర్చించలేదన్నారు. కొండా మురళీ(Konda Murali0 మాట్లాడుతూ, రాహుల్ గాంధీ(Rahul Gandhi)ని ప్రధాని చేయడమే తమ లక్ష్యమన్నారు. త్వరలో లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయని, నేతలంతా కలిసి పని చేస్తామన్నారు. గతంలో జరిగిన వివాదానికి వివరణ ఇచ్చానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ(Congress Party) ఆదేశాలను తప్పకుండా పాటిస్తానని చెప్పారు.
Also Read: Crime News: ప్రియుడిని ఇంటికి పిలిపించి.. భర్తతో కలిసి…