Medchal Crime(Image CREDIT: twitter)
క్రైమ్

Medchal Crime: హత్యకు దారి తీసిన అప్పు వివాదం.. కత్తులతో దారుణం

Medchal Crime: అప్పు తగాదా హత్యకు దారి తీసింది. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితులను పోలీసులు 24గంటల్లోనే అరెస్ట్ చేశారు. బాలానగర్(Balanagar) ఏసీపీ నరేశ్ రెడ్డి తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా(Medchal Malkajgiri District)ఎల్లమ్మబండ నివాసి, స్ర్కాప్​ వ్యాపారి అయిన సయ్యద్​ ఫాజెల్​ తన సోదరునితో కలిసి స్నేహితుడైన మహబూబ్​ కు అయిదేళ్ల క్రితం 11లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చాడు. ఎన్నిసార్లు అడిగినా మహబూబ్ అప్పుగా తీసుకున్న డబ్బు వాపస్ ఇవ్వలేదు.

 Also Read: Gadwal: నూతన రేషన్ కార్డులతో నెరవేరిన పేదల కల

పైగా డబ్బు కోసం ఒత్తిడి తెస్తే చంపేస్తానంటూ సయ్యద్ ఫాజెల్ ను బెదిరించాడు. ఈ క్రమంలో సయ్యద్ ఫాజెల్ తన మేనల్లుడు సయ్యద్ జహంగీర్, అతని స్నేహితులు షేక్ కరీం, షేక్ అమీర్ లతో కలిసి మహబూబ్ ను హత్య చేయాలని పథకం వేశాడు. దాని ప్రకారం  సాయంత్రం 4గంటలకు మహబూబ్ ను ఎల్లమ్మబండ ప్రాంతానికి రమ్మన్నాడు. ఈ క్రమంలో మహబూబ్​ ఇద్దరు స్నేహితులతో కలిసి అక్కడికి వచ్చాడు. అంతా కలిసి గుడ్ విల్ రెస్టారెంట్ కు వెళ్లారు.

డబ్బు విషయమై గొడవ

అక్కడ మరోసారి సయ్యద్​ ఫాజెల్​, మహబూబ్ మధ్య డబ్బు విషయమై గొడవ జరిగింది. దాంతో సయ్యద్​ ఫాజెల్​, సయ్యద్​ జహంగీర్​, షేక్​ కరీం, షేక్ అమీర్​ లు కలిసి కత్తులతో మహబూబ్ పై దాడి చేసి విచక్షణారహితంగా పొడిచారు. దాంతో మహబూబ్ అక్కడికక్కడే చనిపోయాడు. ఈ మేరకు కేసులు నమోదు చేసిన సీఐ(CI) నర్సింహ, డీఐ నరేంద్ర రెడ్డి, బాలానగర్(Balanagar) ఎస్వోటీ పోలీసులతో కలిసి విచారణ చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారు. నలుగురు నిందితులను ఆల్విన్ కాలనీలోని ఆర్​ఆర్​ఆర్​ వైన్స్ వద్ద అరెస్ట్ చేశారు.

 Also Read: CM Revanth protest: పేరు బంధంతో పాటు పేగు బంధం తెంచుకుందాం: రేవంత్ రెడ్డి

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?