MLC Kavitha To Stay In Jail Custody Extended By 14 Days
క్రైమ్

MLC Kavitha: ఊరట లేదు.. కవితకు కస్టడీ పొడిగింపు

Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊరట దక్కడం లేదు. బెయిల్ పిటిషన్ పై దరఖాస్తులు ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. ఇక జ్యుడీషియల్ కస్టడీ గడువు మాత్రం పెరుగుతూనే ఉన్నది. నేటితో ఆమె జ్యుడీషియల్ రిమాండ్ గడువు ముగియడంతో రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి ఆమె కస్టడీని పొడిగించింది. మరో 14 రోజులపాటు ఆమె జ్యుడీషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది. అంటే జూన్ 3వ తేదీ వరకు ఆమె తిహార్‌లో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉండాల్సి ఉంటుంది.

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బెయిల్ కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ కోసం కవిత రౌజ్ అవెన్యూ కోర్టులో పిటిషన్లు వేయగా.. న్యాయమూర్తి కావేరి బవేజా డిస్మిస్ చేశారు. కాగా, రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు విచారించింది. కవిత్ బెయిల్ పిటిషన్ పై స్పందించాలని ఢిల్లీ హైకోర్టు సీబీఐకి నోటీసులు పంపింది. తదుపరి విచారణను మే 24వ తేదీకి వాయిదా వేసింది.

ఇది వరకే ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు విచారించి దీనిపై స్పందించాలని మే 10వ తేదీన ఈడీకి హైకోర్టు నోటీసులు పంపింది. ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్ పై తదుపరిగా మే 24వ తేదీన విచారణ జరపనుంది.

లిక్కర్ పాలసీ కేసులో ఈడీ కవితను మార్చి 15న అరెస్టు చేసింది. ఏప్రిల్ 11న సీబీఐ అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆమె జ్యుడీషియల్ రిమాండ్‌పై తిహార్ జైలులో ఉన్నారు. ఇటీవలే ఆమె జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మే 20వ తేదీ వరకు పొడిగించింది.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు