Dialysis Patients ( Image Source: Twitter)
తెలంగాణ

Dialysis Patients: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. డయాలసిస్ రోగులకు చేయూత.. మంత్రి సీతక్క

Dialysis Patients: డయాలసిస్ చికిత్స పొందుతున్న పేద రోగులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా 681 మంది డయాలసిస్ పేషెంట్లకు “చేయూత” పెన్షన్‌ను మంజూరు చేసింది. ఈ మేరకు మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క సోమవారం సంబంధిత ఫైల్‌పై సంతకం చేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రాష్ట్రవ్యాప్తంగా కేవలం 4,011 మంది డయాలసిస్ పేషెంట్లు మాత్రమే పెన్షన్ అందుకున్నారు. అయితే, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా 4,029 మంది డయాలసిస్ పేషెంట్లకు చేయూత పెన్షన్లు మంజూరు చేసింది.

Also Reda: Director Krish: ఆ శక్తిని ఏ కెమెరా కూడా బంధించలేదు.. పవన్ మండే నిప్పు కణం.. క్రిష్ జాగర్లమూడి

తాజాగా మరో 681 మందికి మంజూరు కావడంతో, రాష్ట్రంలో మొత్తం లబ్ధిదారుల సంఖ్య 8,721కి చేరింది. ఈ పింఛన్లను ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా గుర్తింపు పొందిన వివిధ ఆస్పత్రుల్లో చికిత్స అందుకుంటున్న పేషెంట్ల వివరాల ఆధారంగా మంజూరు చేశారు. ట్రస్ట్ గుర్తించిన 681 మంది డయాలసిస్ పేషెంట్ల వివరాలను సెర్ప్ సాంకేతికంగా పరిశీలించి, ధృవీకరణ అనంతరం పెన్షన్ మంజూరైంది. కొత్తగా ఎంపికైన లబ్ధిదారులకు ఆగస్టు నెల నుంచి నెలనెలా చేయూత పెన్షన్ అందనుంది. 681 మంది కొత్త లబ్ధిదారులలో హైదరాబాద్‌లోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు 629 మంది కాగా, మిగిలిన 52 మంది ఇతర జిల్లాలకు చెందినవారు ఉన్నారు. ఈ నిర్ణయం ఒకవైపు ఆరోగ్య భద్రతను, మరోవైపు ఆర్థిక భరోసాను కల్పించే ప్రజా ప్రభుత్వానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచిందని మంత్రి సీతక్క పేర్కొన్నారు.

Also Reda: Samantha: మరో కొత్త ప్రయత్నానికి సిద్ధమవుతున్న సమంత.. ఈ సారి గెలుస్తుందా లేక గెలిపిస్తుందా?

 

Just In

01

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ