Kota Srinivasa Rao: సినీ పరిశ్రమలో మరో దిగ్గజం కన్నుమూశారు. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మరణం ఇండస్ట్రీని శోకసంద్రంలో ముంచెత్తింది. ఆయన భౌతికకాయానికి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. అయితే, ఈ విషాద సమయంలో కోట జీవితంలోని ఒక ఆసక్తికరమైన, కానీ బాధాకరమైన విషయం బయటపడింది. అదే ఆయన కుటుంబాన్ని వెంటాడిన ‘శాపం’ గురించిన చర్చ.కోట శ్రీనివాసరావుకి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు.
Also Read: Kota Srinivasa Rao: ఆ శాపం వేటాడిందా.. అందుకే కోట శ్రీనువాసరావు జీవితంలో అలా జరిగిందా ?
కొన్నేళ్ల క్రితం, ఆయన కూతురు ఒకరు రిక్షా ఎక్కాలనే కోరికతో విజయవాడలో రిక్షాలో ప్రయాణించారు. అయితే, దురదృష్టవశాత్తూ, బ్రేకులు ఫెయిలైన లారీ ఆ రిక్షాని ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు. అదృష్టవశాత్తూ, కోట కూతురు ప్రాణాలతో బయటపడినప్పటికీ, ఆమె కాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన ఆ కుటుంబాన్ని కమ్మిన బాధ నీడలా మిగిలిపోయింది.
Also Read: Tollywood: ఇండస్ట్రీకే కాదు.. ఇండియన్ సినిమాకు తీరని లోటు.. కోట మరణంపై తెలుగు సెలబ్రిటీల సంతాపం
అయితే, ఈ దుఃఖం నుంచి కోట కుటుంబం ఇంకా కోలుకోకముందే మరో విషాదం వారిని వెంటాడింది. కొద్ది సంవత్సరాల తర్వాత, కోట కొడుకు కూడా ఓ రోడ్డు ప్రమాదంలోనే తుదిశ్వాస విడిచారు. వరుసగా కూతురు, కొడుకు రోడ్డు ప్రమాదాల బారిన పడటంతో, కోట శ్రీనివాసరావు కుటుంబాన్ని ఏదో ‘శాపం’ వెంటాడుతోందనే చర్చ జనంలో మొదలైంది. ఈ విషాద సంఘటనలు ఆయన జీవితంలోని బాధాకరమైన అధ్యాయాలుగా మిగిలిపోయాయి. ఈ ‘శాపం’ గురించిన నిజానిజాలు ఎప్పుడు బయటపడతాయో తెలియదు, కానీ కోట శ్రీనివాసరావు సినీ రంగానికి అందించిన కృషి, ఆయన నటనా పాటవం ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
Also Read: Indian Origin Couple: అమెరికా నుంచి వచ్చేస్తామన్న భారత జంట.. నెటిజన్ల షాకింగ్ రియాక్షన్!