Formula E Race Case( IMAGE CREDIT: TWITTER)
Politics

Formula E Race Case: వాట్సాప్ మెసేజ్‌తోనే 45 కోట్ల చెల్లింపు? అరవింద్ కుమార్ షాకింగ్ వాంగ్మూలం!

Formula E Race Case: కేటీఆర్​ చెబితేనే ఫార్మూలా ఈ – కార్ రేస్ కంపెనీకి చెల్లింపులు జరిపినట్టుగా ఐఏఎస్​ అధికారి అరవింద్ కుమార్ (Arvind Kumar) ఏసీబీ (ACB)  అధికారులతో చెప్పినట్టుగా తెలిసింది. ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని కూడా సూచించానని తెలియచేసినట్టు సమాచారం. అయితే, అంతా నేను చూసుకుంటా చెల్లింపులు జరపండని కేటీఆర్​ వాట్సాప్​ మెసేజ్​ పెట్టారని చెప్పినట్టుగా తెలియవచ్చింది. ఆ తరువాతే తాను ఫార్మూలా ఈ – కార్ రేస్ (Formula E – Car Race) కంపెనీకి చెల్లింపులు చేశానని దీంట్లో నా స్వార్థం ఏమీ లేదని వాంగ్మూలం ఇచ్చినట్టుగా సమాచారం.

 Also Read:Telangana: తెలంగాణ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి ప్లాన్!

అప్పట్లో జరిగింది ఇదే..

హైదరాబాద్ (Hyderabad) బ్రాండ్​ ఇమేజ్​‌ను అంతర్జాతీయ స్థాయిలో పెంచుతున్నామని చెప్పుకొని గత బీఆర్​ఎస్ (BRS)​ ప్రభుత్వం హైదరాబాద్​‌లో ఫార్మూలా ఈ – కార్​ రేస్ (Formula E – Car Race) ​ను జరిపింది. రెండో సంవత్సరం రేస్ ప్రారంభం కావడానికి ముందే దీని నుంచి స్పాన్సర్స్​ తప్పుకొన్నారు. దాంతో అప్పటి బీఆర్​ఎస్ (BRS)​ ప్రభుత్వం హెచ్​ఎండీఏ ద్వారా ఫార్మూలా కంపెనీకి చెల్లింపులు జరిపింది. అయితే, ఇది జరిగినప్పుడు ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో చెల్లింపులకు ఎలక్షన్​ కమిషన్ అనుమతి తీసుకోవాల్సి ఉండగా ఆ పని చేయలేదు. ఇక, 10 కోట్లకు మించి విదేశీ కంపెనీలకు చెల్లింపులు జరపాల్సి వస్తే రిజర్వ్​ బ్యాంక్​ నుంచి అనుమతి తీసుకోవాలన్న నిబంధనను కూడా పట్టించుకోలేదు. 45.71కోట్ల రూపాయలను బ్రిటన్​ పౌండ్ల రూపంలో ఇండియన్ ఓవర్సీస్​ బ్యాంక్​ ద్వారా ఫార్మూలా ఈ – కార్​ రేస్​  (Formula E – Car Race) ​కంపెనీకి చెల్లించింది.

కేటీఆర్ వాంగ్మూలం

కాంగ్రెస్​ ప్రభుత్వం (Congress Govt) కొలువుదీరాక ఈ వ్యవహారం వెలుగు చూడడం కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్​ ప్రభుత్వం (Congress Govt) దీనిపై ఏసీబీ (ACB) విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలో ఏసీబీ (ACB) అధికారులు మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్ (KTR) కేటీఆర్​‌ను కేసులో ప్రధాన నిందితుడిగా, అప్పట్లో హెచ్ఎండీఏ కమిషనర్​‌గా పని చేసిన ఐఏఎస్​ అధికారి అరవింద్ కుమార్​‌ను (Arvind Kumar) ఏ2గా, హెచ్​ఎండీఏ ఛీఫ్ ఇంజినీర్‌గా పని చేసిన బీఎల్​ఎన్​ రెడ్డిని ఏ3గా పేర్కొంటూ కేసులు నమోదు చేసింది. ఇటీవలే కేటీఆర్‌ను ఏసీబీ కార్యాలయానికి పిలిపించిన అధికారులు రెండోసారి ఆయన వాంగ్మూలం తీసుకున్నారు. అరవింద్​ కుమార్​ ను పిలిపించారు.

అరవింద్‌ కుమార్ విచారణ

కేటీఆర్ (KTR) ​ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అరవింద్‌ను (Arvind Kumar) ప్రశ్నించారు. ఈ క్రమంలో ఆయన ఏసీబీ (ACB) అధికారుల ప్రశ్నలకు సమాధానాలిస్తూ కేటీఆర్ చెప్పిన మేరకే తాను చెల్లింపులు చేశానని చెప్పినట్టుగా తెలిసింది. ఆర్థిక శాఖ ఇతర అనుమతుల గురించి చెప్పానని, అయితే అంతా తాను చూసుకుంటానని కేటీఆర్​ చెప్పారని వెల్లడించినట్టు సమాచారం. ఫార్మూలా ఈ – కార్ రేస్ కంపెనీకి చెల్లింపులు జరపాలని కేటీఆర్ (KTR)​ తనకు వాట్సాప్​ మెసేజ్​ కూడా పెట్టారని చెప్పినట్టుగా తెలియవచ్చింది. ఆ తరువాతే తాను ఫార్మూలా ఈ – కార్​ రేస్​ (Formula E – Car Race) ​ కంపెనీకి చెల్లింపులు జరిపానని వెల్లడించినట్టుగా తెలిసింది. దీంట్లో తన స్వార్థం ఏదీ లేదని చెప్పినట్టుగా సమాచారం. ఇక, మొదటిసారి రేస్​ జరిగినప్పుడు స్పాన్సర్​‌గా ఉన్న ఎస్​ నెక్ట్స్​ జెన్​‌తో జరిగిన ఒప్పందం, ఆ తరువాత ఆ సంస్థ అగ్రిమెంట్​ నుంచి తొలగిన అంశంపై కూడా అరవింద్ కుమార్‌‌ను (Arvind Kumar) ప్రశ్నించినట్టు సమాచారం.

 Also Read: Kavitha: కవిత ఓటమికి కారణం ఎవరు?.. సొంత పార్టీ నేతలా?

Just In

01

Nude Gang: నగ్నంగా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు