Star Actress: సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల మీద ఎన్నో రూమర్స్ వస్తుంటాయి. కొందరు వాటిని లైట్ తీసుకుంటారు. మరి కొందరు సీరియస్ గా తీసుకుని చాలా బాధ పడతారు. నిజం చెప్పాలంటే సినీ ఇండస్ట్రీలో పని చేస్తున్న నటి నటులు ఎన్నో అవమానాలు పడతారు. అవన్ని దాటుకుని నిలబడిన వారే దీనిలో ఎక్కువ కాలం నిలబడతారు. ఇక కొందరైతే 15, 16 ఏళ్ల వయసులోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెడతారు. అలాంటి వారిలో ఒకరు కథానాయిక వనిత విజయ్ కుమార్.
Also Read: Swetcha Effect: నకిలీలపై ఫోకస్ జిల్లాలకు స్పెషల్ టీమ్స్.. ఆత్మలకు చేయూత పేరుతో స్వేచ్ఛ కథనాలు!
తల్లిదండ్రుల నుంచి నటన వారసత్వాన్ని పొంది, తమిళం, మలయాళం ఇండస్ట్రీలలో మంచి పేరు తెచ్చుకుంది. ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమాల్లో కూడా నటించింది. వనిత తెలుగులో మొదటగా ‘దేవి’ సినిమాలో నటించింది. సీనియర్ నటుడు నరేష్ హీరోగా తెరకెక్కిన ‘మళ్లీ పెళ్లి’ లో ఆమె నటించింది.
Also Read: Swetcha Effect: నకిలీలపై ఫోకస్ జిల్లాలకు స్పెషల్ టీమ్స్.. ఆత్మలకు చేయూత పేరుతో స్వేచ్ఛ కథనాలు!
తాజాగా వనిత ‘మిస్టర్ అండ్ మిసెస్’ అనే సినిమాలో నటిస్తూ, దర్శకత్వ బాధ్యతలను కూడా నిర్వహిస్తోంది. ఈ మూవీ జూలై 11న రిలీజ్ కానుంది. చిత్ర ప్రమోషన్స్లో భాగంగా వనిత ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అనుభవాన్ని అందరితో పంచుకుంది. ‘చంద్రలేఖ’ చిత్రం చేస్తున్నప్పుడు నా వయసు 15 ఏళ్లు. ఆ సమయంలో నా మీద తప్పుడు రూమర్స్ క్రియోట్ చేశారు.
Also Read: Love Affair: ఒకేసారి ఆరుగురితో లవ్ ఎఫైర్.. యువతికి లైఫ్ లో గుర్తిండిపోయే ఝలక్ ఇచ్చిన అబ్బాయిలు!
40 ఏళ్ల వయసున్న రాజ్ కిరణ్తో నాకు లింకు పెట్టి రక రకాల వార్తలు రాశారు. అవి చూసి నేను సెట్లోనే ఏడ్చాను. ఆ సమయంలో హీరో విజయ్ నా దగ్గరికి వచ్చి, మాట్లాడి ధైర్యం చెప్పాడు. నేను జరిగిన విషయం మొత్తం చెప్పగా, ‘ఇవన్నీ నీ మీదే వస్తున్నాయంటే.. నీవు ఫేమస్ అయిపోయినట్టే. నీ గురించి ఎలాంటి వార్త రాకపోతే, నీవు హీరోయిన్గా పని చేయడం కూడా వృథా అని’ అన్నాడని ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకొచ్చింది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.