Encounter In Chhattisgarh, Six Naxals Killed
క్రైమ్

Encounter: ఛత్తీస్‌గడ్‌లో భీకర ఎన్‌కౌంటర్.. 12 మంది నక్సల్స్ మృతి

Chhattisgarh: ఛత్తీస్‌గడ్ అడవుల్లో మరోసారి భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలో పెడియా అడవుల్లో శుక్రవారం ఉదయం 6 గంటలకు మొదలై సుమారు 11 గంటలపాటు ఉభయ వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు మరణించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ఘటనా స్థలం నుంచి 12 మంది మావోయిస్టుల మృతదేహాలు, ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనను ఛత్తీస్‌గడ్ సీఎం విష్ణుదేవ్ సాయి ధ్రువీకరించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో సైనికులు గొప్ప విజయం సాధించారని ప్రకటించారు.

మావోయిస్టు అగ్రనేతలు ఉన్నారనే సమాచారం అందడంతో సుమారు 1200 మంది డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్, కోబ్రా, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. గంగలూరు పోలీసు స్టేషన్ పరిధిలోని పెడియా అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు మొదలయ్యాయి. సుమారు 11 గంటలపాటు ఈ కాల్పులు జరిగాయి. బస్తర్ ఐజీ, బీజాపూర్, దంతెవాడ, సుక్మా జిల్లాల డీఐజీ, ఎస్పీలు ఈ ఎన్‌కౌంటర్‌ను పర్యవేక్షించారు.

Just In

01

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?

Gaddam Prasad Kumar: మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం.. గడ్డం ప్రసాద్ కీలక వ్యాఖ్యలు