Swetcha Special story: ఎన్నో అవార్డులు,రివార్డులు ఉదయ్ కుమార్ రెడ్డి స్వంతం.ఎస్ ఐ నుండి…ఎస్పీ వరకు బాధ్యతగా పదవులు నిర్వహించి ప్రమోషన్ లు పొంది నేడు మెదక్ లో పదవి విరమణ పొందుతున్న మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి పై స్వేచ్ఛ అందిస్తున్న ప్రత్యేక కథనం..
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి లో సామ్రాజ్యం,,సుబ్బారెడ్డి దంపతులకు లకు జన్మించిన ఉదయ్ కుమార్ రెడ్డి,1991 లో ఎస్ ఐ గా అదిలాబాద్ జిల్లా కడెం పోలీసు స్టేషన్ లో బాధ్యతలు చేపట్టారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత ప్రమోషన్ లో బాగంగా నిర్మల్ జిల్లా ఎస్పీ గా బాధ్యతలు చేపట్టారు.ఎస్ ఐ గా బాధ్యతలు నిర్వహించిన చోట నే ఎస్పీగా బాధ్యతలు నిర్వహించడం తన అదృష్టంగా భావిస్తున్నానని మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి స్వేచ్ఛకు తెలిపారు.ముఖ్యంగా యువత,డ్రగ్స్, మద్యానికి బానిస కావద్దని సూచించారు.కస్టపడి చదివి ఇష్టమైన ఉద్యాగాన్ని పొందాలని యువతకు సూచించారు.యువత అనుకుంటే సాధ్యం కానిది ఏది లేదని అన్నారు.
Also Read: Naa Anveshana: ఆ ప్రశ్న ఒక్కటి చాలు.. భయ్యా సన్నీ యాదవ్ బొక్కలన్నీ బయటపడతాయ్!
.నక్సలైట్ల సింహ స్వప్నం…
కడెం ఎస్ ఐ గా ఉన్నప్పుడు, ప్రస్తుత డీ జి పీ జితేందర్ ఎస్పీ గా ఉన్న సమయంలో నక్సలైట్లతో ఆ జిల్లాల్లో ఎన్ కౌంటర్ స్పెషలిస్టు గా ఉదయ్ కుమార్ రెడ్డి పేరు తెచ్చుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వెళ్లకుండా నిర్మూలించగలరు ఆయా గ్రామాల్లో కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడి రోడ్లు ఉపయోగించిన సంఘటన కూడా ఉన్నాయి.ప్రత్యేకంగా అమెరికాలో అవార్డు సహితం పొందారు.
మెదక్ జిల్లా లో….
18 నెలల ఎస్పీ గా బాధ్యతలు నిర్వహించిన ఉదయ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా రోడ్ ప్రమాదాల నివారణకు స్వయంగా నడుం బిగించారు.ముఖ్యంగా,హైదరాబాద్,నర్సాపూర్,జాతీయ రహదారి పై ప్రమాద స్పాట్ లను గుర్తించి,స్వయంగా నివారణ చర్యలు చేపట్టారు. కోల్టు ప్రమాద స్పాట్ ల లో బోల్ట్ లను ఏర్పాటు చేయించారు.క్రైమ్ రేట్ తగ్గించడంలో కీలక పాత్రh పోషించారు.నేటి తో శనివారం తో మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి పదవీవిరమణ చేస్తున్నారు.ఉదయ్ కుమార్ రెడ్డి కి భార్య అరుణ తో పాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు.
Also Read: KTR on BRS: సంపద సృష్టిలో.. దేశంలో తెలంగాణదే అగ్రస్థానం!