Maharashtra Tiger Attack: రక్తం మరిగిన పులి.. దాడిలో నలుగురు మహిళలు మృతి..
Maharashtra Tiger Attack(image credit:X)
జాతీయం

Maharashtra Tiger Attack: రక్తం మరిగిన పులి.. దాడిలో నలుగురు మహిళల మృతి..

Maharashtra Tiger Attack: వేర్వేరు చోట్ల పులులు దాడి చేయడంతో నలుగురు మహిళలు దుర్మరణం పాలైన ఘటన మహారాష్ట్రలోని చంద్రపుర్ లో చోటుచేసుకుంది. సిందెవాహి తాలూకా మేండమాల గ్రామానికి చెందిన కొంతమంది తునికాకు సేకరణ కోసం సోమవారం ఉదయం సమీప చార్ గావ్ అటవీక్షేత్రంలోకి వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు.

సాయంత్ర మైనా కాంత చౌదరి, శుభాంగీ చౌదరి, రేఖ షిండే లు ఇళ్ళకు తిరిగి రాకపోవడంతో. కుటుంబీకులు గ్రామస్థులతో కలిసి అటవీ ప్రాంతానికి వెళ్లి వెతికారు. అలా అడవిలో కొన్నిచోట్ల వెతకగా ఓ చెరువు వద్ద ముగ్గురి మృతదేహాలు కనిపెంచగా అటవీ అధికారులకు సమాచారమివ్వడంతో అక్కడికి చేరుకున్న ఎఫ్ ఆర్ ఓ విశాల్ సాల్ కార్ ఆధ్వర్యంలో బృందం ఘటనా స్థలానికి చేరుకొని పులి దాడి చేయడంతోనే మహిళలు మృతి చెందారని నిర్ధారించారు.

Also read: Kodali Nani: కొడాలి నాని బాగోతం బట్టబయలు.. రాజకీయాలకు వైసీపీ కీలక నేత గుడ్ బై

ఇదిలా ఉండగా.. మూల్ తాలూకా నాగాడా గ్రామంలో మరో ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన విమల షిండే సోమవారం ఉదయం తునికాకు సేకరించేందుకు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతానికి స్థానికులతో కలిసి వెళ్లింది.

హఠాత్తుగా ఆమె పై పులిదాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయింది. అనంతరం అక్కడే ఉన్న స్థానికులు భయబ్రాంతులకు గురై కేకలు వేయడంతో పులి అడవిలోకి పారిపోయింది.
మొత్తానికి ఒకే రోజు పులి దాడిలో నలుగురు మృత్యువాత పడడంతో స్థానిక ప్రజలు భయాందోళనతో ఉన్నారు.

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?