Betting In Warangal: వరంగల్ జిల్లాలో బెట్టింగ్ నిర్వాహకుల సిండికేట్ అనే పేరుతో దందా మొదలైనట్టు విశ్వస నీయ సమాచారం. వేసవి కాలం వచ్చింది కాబట్టి సమ్మర్ వెకేషన్ అనే పేరుతో ఇదే అదునుగా సరికొత్త దందాకు బెట్టింగ్ ముఠాలు తెరలేపినట్టుగా తులుస్తుంది. కేసినో బెట్టింగ్ ఈవెంట్లను నిర్వహిస్తున్నట్టు కొన్ని ముఠాలు ఎర్పడ్డాయి. గోవా, శ్రీలంకలలో కేసినో బెట్టింగ్ ఈవెంట్ల వున్నాయని యువకులను మభ్యకొల్పి సోషల్ మీడియాలో ప్రమోషన్లు సృష్టించి బురిడి కొట్టిస్తున్నారు.
వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, యువత అని కొన్నిగ్రూపులు గా చేసి ఎవరి క్యాటగిరి వాల్లదే అన్నట్టు బడా బాబులను సైతం టార్గెట్ గా ఓక్కోక్కరికి ఓక్కో ప్యాకేజి అన్నట్టు స్పెషల్ ప్యాకేజీలుగా తయారు చేసి కొన్ని ముఠాలు డబ్బు సంపాదించడం కోసం కొత్త ఐడియాలతో ముందుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటివల కాలంలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లపై నిఘా కొనసాగుతుండటంతో బెట్టింగ్ ముఠాలు కేసినో బెట్టింగ్ నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. దీంతో కేసినో బెట్టింగ్ ల కారణంగా కోట్లల్లో బాదితులు అప్పుల పాలవుతున్నారు.
Also Read: Moist Killed: వరంగల్ లో భీకర ఎదురు కాల్పులు.. ఐదుగురు మృత్యువాత?
కేసినో బెట్టింగ్ లకు ఆకర్షితులను చేస్తూ ఎంతోమంది అమాయకులను బెట్టింగ్ భూతానికి సిండికేట్ సంస్ధ బలి చేస్తుంది. లక్షల రూపాయలు బెట్టింగ్ లలో కోల్పోయి, బాధితులు అప్పులు అవుతున్నారు. ఇ బెట్టింగ్ లో ముందుగానే తమ అకౌంట్లలో లక్షల రూపాయలు డిపాజిట్ చేయాలని నిబంధన వుంది. దీంతో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్లపై చర్యలు తీసుకున్నట్లెు గానే పోలీసులు ఈ కేసినో బెట్టింగ్ ప్రమోటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్న బాధితులు కోరుతున్నారు.
Also Read: స్వేచ్ఛ E పేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/