Medchal Crime (image credit:Canva)
క్రైమ్

Medchal Crime: బిడ్డకు విషమిచ్చి.. తల్లి ఆత్మహత్యాయత్నం.. చివరికి ఒకరు మృతి..

Medchal Crime: నాలుగేళ్ల కూతురికి విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం చేసిన ఉదంతమిది. ఈ సంఘటనలో చిన్నారి మరణించగా తల్లి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. స్థానికంగా తీవ్ర విషాదం సృష్టించిన ఈ సంఘటన బాచుపల్లి ప్రగతినగర్​ లో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ప్రగతినగర్​ లోని హరిత ఆర్కెడ్​ లో నివాసముంటున్న కృష్ణ పావని (33), సాంబ శివరావు భార్యాభర్తలు. వీరి కూతురు జశ్విక (4). ఇదెలా ఉండగా కొంతకాలంగా కృష్ణ పావని ఆరోగ్య పరమైన సమస్యలతో సతమతమవుతోంది.

ఈ క్రమంలో తనకేదైనా జరిగితే కూతురు అనాధ అవుతుందని భావించిన ఆమె ఈనెల 18న రాత్రి మాజా కూల్​ డ్రింక్​ లో ఎలుకల మందు కలిపి జశ్వికతో తాగించింది. ఆ తరువాత తాను కూడా విషం కలిపిన కూల్​ డ్రింక్​ ను సేవించింది. ఆ మరుసటి రోజు తీవ్ర స్థాయిలో కడుపునొప్పి రావటంతో విషయాన్ని భర్తకు తెలిపింది. వెంటనే సాంబ శివరావు భార్య, కూతురిని కేపీహెచ్​బీలోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రికి తీసుకెళ్లాడు.

Also Read: Reddy Betting App: వైఎస్ జగన్ ఆశీస్సులున్నాయా? నా అన్వేషణ షాకింగ్ వీడియో!

అక్కడ చికిత్స పొందుతూ జశ్విక తుదిశ్వాస వదిలింది. కృష్ణ పావని ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతోంది. బాచుపల్లి పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కాగా, జశ్విక చనిపోవటంపై అపార్ట్​ మెంట్ వాసులు బాధను వ్యక్తం చేశారు. అపార్ట్​ మెంట్​ లో అందరినీ పలకరిస్తూ చిన్నారి జశ్విక ఆడుకునేదని గుర్తు చేసుకున్నారు. తమకిచ్చినా పెంచుకునే వారమని ఆవేదన వ్యక్తం చేశారు.

Just In

01

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు