Mahabubabad Murder (imagedrdit:canva)
క్రైమ్

Mahabubabad Murder: గిరిజన యువకుడు దారుణ హత్య.. కలకలం

ఏటూర్ నాగారం/మహబూబాబాద్ స్వేచ్ఛ: Mahabubabad Murder: ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన యువకుడిని అత్యంత దారుణంగా గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్త టేకులగూడెం గ్రామానికి చెందిన గిరిజన యువకుడు వాసం విజయ్(28)ను గుర్తు తెలియని దుండగులు తలపై గొడ్డలితో అతి దారుణంగా, అత్యంత పాశవికంగా గొడ్డలితో దాడి చేసి హతమర్చారు.

ఈ సంఘటన వివరాలు తెలుసుకున్న వెంకటాపురం సిఐ బండారి కుమార్, పేరూరు ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. తదనంతరం కుటుంబ సభ్యుల నుండి వివరాలు సేకరించి విచారణ ప్రారంభించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంతటి దారుణానికి ఒడిగట్టడంతో టేకులగూడెం గ్రామంలో అలజడి మొదలైంది.

ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. హత్య పైన పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అసలు ఈ హత్య ఎందుకు చేశారు కుటుంబ కలహాలా ఆస్తి తగాదాల వివాహేతర సంబంధాల అనే పలు విధాల కోణాల్లో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు.

Also Read: Mujra Party: ఫామ్ హౌస్ లో ముజ్రా పార్టీ.. పోలీసుల స్పెషల్ ఆపరేషన్.. తర్వాత ఏమైందంటే?

Just In

01

KCR KTR Harish Meet: ఎర్రవెల్లిలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు సుధీర్ఘ చర్చలు.. నెక్స్ట్ స్టెప్ ఏంటి?

Ganesh Immersion 2025: పాతబస్తీ గణనాధులపై స్పెషల్ ఫోకస్.. మంత్రి పొన్నం, డీజీపీ, మేయర్ విజయలక్ష్మి ఏరియల్ సర్వే

Kishkindhapuri: మొదట్లో వచ్చే ముఖేష్ యాడ్ లేకుండానే బెల్లంకొండ బాబు సినిమా.. మ్యాటర్ ఏంటంటే?

Asia Cup Prediction: ఆసియా కప్‌లో టీమిండియాతో ఫైనల్ ఆడేది ఆ జట్టే!.. ఆశిష్ నెహ్రా అంచనా ఇదే

Ganesh Immersion 2025: హైదరాబాద్‌లో 2 లక్షల 54 వేల 685 విగ్రహాలు నిమజ్జనం.. జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడి