తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Malkajgiri court: మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ నిందితునికి మల్కాజిగిరి జిల్లా పోక్సో కేసుల ప్రత్యేక కోర్టు 20 సంవత్సరాల జైలు శిక్ష, మరియు 5వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. బాధితురాలికి పరిహారంగా 5లక్షల రూపాయలు అందచేయాలని ఆదేశించింది.
మల్లాపూర్ నివాసి బచ్చన్ ప్రసాద్ (64) ప్రైవేట్ ఉద్యోగి. తాను ఉంటున్న ఇంటి కాపౌండ్ లోనే నివాసముంటున్న కుటుంబంలోని మైనర్ బాలికపై బచ్చన్ ప్రసాద్ గతంలో లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ మేరకు నాచారం పోలీసులు కేసులు నమోదు చేసి నిందితున్ని అరెస్ట్ చేశారు. విచారణ పూర్తి చేసిన తరువాత కోర్టుకు ఛార్జిషీట్ దాఖలు చేశారు.
కేసును విచారించిన కోర్టు నిందితునికి జైలుశిక్ష, జరిమానా విధించింది. ఈ కేసులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఉపేందర్, సుశీల వాదనలు వినిపించారు.
Also Read: స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/