తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ : MLA Donthi Madhava Reddy: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో తనకు కూడా అవకాశం కల్పించాలని ఏఐసీసీ పెద్దలకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి విజ్ఞఫ్తి చేశారు. ఢిల్లీకి వెళ్లిన ఎమ్మెల్యే… ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ను గురువారం కలిసి ఈ మేరకు విజ్ఞఫ్తి చేశారు.
పార్టీ కష్టాల్లో ఉన్నా ఇతర పార్టీల్లోకి వెళ్ళకుండా సొంత సంస్థ కోసం పనిచేశానని, నిబద్ధతగా ఉన్నానని, పార్టీకి తాను చేసిన సేవలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలతో పాటు ఇటీవల అసెంబ్లీ ఆమోదించిన బీసీ రిజర్వేషన్ బిల్లులు, ఎస్సీ వర్గీకరణ బిల్లు తదితరాల గురించి వారికి వివరించారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు