Diamond Hills Robbery case: లేడీ డాన్ కుమారులే అసలు కారకులు
Diamond Hills Robbery case
క్రైమ్

Diamond Hills Robbery case: లేడీ డాన్ కుమారులే అసలు కారకులు.. అసలేం ఏం చేశారంటే?

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: Diamond Hills Robbery case: కలకలం సృష్టించిన డైమండ్​ హిల్స్​ చోరీ కేసులోని నిందితులను ఫిలింనగర్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. గోల్కొండ ప్రాంతానికి చెందిన లేడీ డాన్ సనా కొడుకులే ఈ నేరానికి పాల్పడ్డట్టుగా సమాచారం. ఇటీవల డైమండ్​ హిల్స్​ కాలనీలోని ఓ ఇంట్లో దొంగలు పడి 34తులాల బంగారు నగలు, 4.5లక్షల నగదును తస్కరించి ఉడాయించిన విషయం తెలిసిందే.

ఈ మేరకు ఫిర్యాదు అందగా కేసులు నమోదు చేసిన ఫిలింనగర్​ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించినపుడు పలు కేసుల్లో నిందితురాలిగా ఉన్న లేడీ డాన్ సనా ఇద్దరు కొడుకులు ఈ నేరానికి పాల్పడినట్టుగా వెల్లడైంది. ఈ క్రమంలో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. పోలీసులు ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా వివరాలను వెల్లడించనున్నారు.

Also Read: TG on Tax Evasion: పన్నుల ఎగవేతపై సర్కార్ సీరియస్.. పెద్ద ప్లాన్ రెడీ.

మాజీ మేయర్​ కొడుకుపై కేసులు
కరీంనగర్​ మాజీ మేయర్​ కొడుకుపై జూబ్లీహిల్స్​ పోలీస్​ స్టేషన్​ లో కేసులు నమోదయ్యాయి. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. సునీల్ రావు బీఆర్​ఎస్ పార్టీ తరపున కరీంనగర్​ మేయర్​ గా పని చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ పార్టీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా, ఆయన కుమారుడు ప్రద్యుమ్న్​ఈనెల 19న ఇద్దరు స్నేహితులతో కలిసి మద్యం సేవించి వేగంగా కారు నడుపుతూ జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్​ 10లో ఫుట్​ పాత్ ను ఢీకొట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా ప్రమాదం చేసింది ప్రద్యుమ్న్​ అని నిర్ధారించుకున్న పోలీసులు అతనిపై కేసులు నమోదు చేశారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Harish Rao: కాంగ్రెస్ హింసా రాజకీయాలను అడ్డుకుంటాం : మాజీ మంత్రి హరీష్ రావు

Kishan Reddy: మోడీతో ఎంపీల మీటింగ్ అంశం లీక్ చేసినోడు మెంటలోడు.. కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం!

Homebound Movie: ఆస్కార్ 2026 టాప్ 15లో నిలిచిన ఇండియన్ సినిమా ‘హోమ్‌బౌండ్’..

Panchayat Elections: నేడు మూడో విడత పోలింగ్.. అన్ని ఏర్పాటు పూర్తి చేసిన అధికారులు!

Thummala Nageswara Rao: యూరియా కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు