Diamond Hills Robbery case
క్రైమ్

Diamond Hills Robbery case: లేడీ డాన్ కుమారులే అసలు కారకులు.. అసలేం ఏం చేశారంటే?

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: Diamond Hills Robbery case: కలకలం సృష్టించిన డైమండ్​ హిల్స్​ చోరీ కేసులోని నిందితులను ఫిలింనగర్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. గోల్కొండ ప్రాంతానికి చెందిన లేడీ డాన్ సనా కొడుకులే ఈ నేరానికి పాల్పడ్డట్టుగా సమాచారం. ఇటీవల డైమండ్​ హిల్స్​ కాలనీలోని ఓ ఇంట్లో దొంగలు పడి 34తులాల బంగారు నగలు, 4.5లక్షల నగదును తస్కరించి ఉడాయించిన విషయం తెలిసిందే.

ఈ మేరకు ఫిర్యాదు అందగా కేసులు నమోదు చేసిన ఫిలింనగర్​ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించినపుడు పలు కేసుల్లో నిందితురాలిగా ఉన్న లేడీ డాన్ సనా ఇద్దరు కొడుకులు ఈ నేరానికి పాల్పడినట్టుగా వెల్లడైంది. ఈ క్రమంలో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. పోలీసులు ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా వివరాలను వెల్లడించనున్నారు.

Also Read: TG on Tax Evasion: పన్నుల ఎగవేతపై సర్కార్ సీరియస్.. పెద్ద ప్లాన్ రెడీ.

మాజీ మేయర్​ కొడుకుపై కేసులు
కరీంనగర్​ మాజీ మేయర్​ కొడుకుపై జూబ్లీహిల్స్​ పోలీస్​ స్టేషన్​ లో కేసులు నమోదయ్యాయి. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. సునీల్ రావు బీఆర్​ఎస్ పార్టీ తరపున కరీంనగర్​ మేయర్​ గా పని చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ పార్టీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా, ఆయన కుమారుడు ప్రద్యుమ్న్​ఈనెల 19న ఇద్దరు స్నేహితులతో కలిసి మద్యం సేవించి వేగంగా కారు నడుపుతూ జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్​ 10లో ఫుట్​ పాత్ ను ఢీకొట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా ప్రమాదం చేసింది ప్రద్యుమ్న్​ అని నిర్ధారించుకున్న పోలీసులు అతనిపై కేసులు నమోదు చేశారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!