Young India Police School [ image credit: Ai]
తెలంగాణ

Young India Police School: అడ్మిషన్లు షురూ.. వారికి మాత్రమే ఛాన్స్!

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: Young India Police School: ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రారంభించిన యంగ్​ ఇండియా పోలీస్​ స్కూల్లో అడ్మిషన్ల ప్రక్రియ మొదలైంది. హైదరాబాద్​ కమిషనర్​ సీ.వీ.ఆనంద్​ గురువారం స్కూల్​ కు వెళ్లి స్వయంగా లాటరీ పద్దతి ద్వారా 45మంది విద్యార్థుల తల్లిదండ్రులకు అడ్మిషన్​ లెటర్లను అందచేశారు. విధుల నిర్వహణలో నిత్యం బిజీగా ఉండే పోలీసు సిబ్బంది తమ పిల్లల స్కూల్​ అడ్మిషన్లు, చదువులపై పెద్దగా దృష్టిని కేంద్రీకరించ లేకపోతున్న విషయం తెలిసిందే.

Also Read: Viral News: తెలంగాణలో వింత పరిస్థితి.. అసలు విషయం తెలిస్తే.. ఔరా ఔరా అనాల్సిందే..

ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి మంచిరేవుల వద్ద భూమిని కేటాయించి యంగ్ ఇండియా పోలీస్​ స్కూల్ ను ఏర్పాటు చేయించారు. ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు మొదలవుతాయని, అడ్మిషన్లు కావాలనుకున్న వారు వెబ్​ సైట్​ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని ఇటీవల కమిషనర్​ సీ.వీ.ఆనంద్​ ప్రకటించారు. ఒక్క తరగతిలో 40మంది విద్యార్థులకు అడ్మిషన్లు ఉంటాయని, వీటిలో యాభై శాతం పోలీసు సిబ్బంది పిల్లలకు మిగితా యాభై శాతం సీట్ల కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దీనికి భారీగా స్పందన వచ్చింది.

Also Read: Gajularamaram: అధికారులూ.. కాస్త ఒక లుక్ వేయండి ప్లీజ్..

తమ తమ పిల్లలకు అడ్మిషన్లు కావాలంటూ పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు దరఖాస్తులు చేసుకున్నారు. ఈ క్రమంలో అడ్మిషన్లు పూర్తిగా పారదర్శకంగా ఉండాలని గురువారం కమిషనర్​ సీ.వీ.ఆనంద్​ స్కూల్​ కు వెళ్లి తల్లిదండ్రుల సమక్షంలోనే లాటరీ ద్వారా విద్యార్థులను ఎంపిక చేశారు. ఈ క్రమంలో ఒకటి నుంచి 5వ తరగతి వరకు లాటరీ ద్వారా ఎంపికైన 56మంది విద్యార్థుల తల్లిదండ్రులకు అడ్మిషన్​ లెటర్లు ఇచ్చారు. వీరిలో 45మంది పోలీసు సిబ్బంది పిల్లలు ఉండగా 11మంది జనరల్​ కుటుంబాలకు చెందిన వారన్నారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం

Crime News: దుస్తులు లేకుండా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?