Karimnagar News
క్రైమ్

Karimnagar News: ఉద్యోగమంటే ఆశపడ్డారో.. ఆ తర్వాత చిత్రహింసలే.. తస్మాత్ జాగ్రత్త!

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: Karimnagar News: ఉద్యోగమంటే దేశంగాని దేశం వచ్చా..ఇక్కడికి రాగానే పాస్​ పోర్ట్​, వీసా తీసేసుకున్నారు…సైబర్​ నేరాలు చేయమంటున్నారు…చేయనంటే చిత్రహింసలు పెడుతున్నారు…కాపాడండి…ఇటీవల థాయ్​ లాండ్​ నుంచి కరీంనగర్​ జిల్లాకు చెందిన మధుకర్ రెడ్డి అనే యువకుడు సోషల్​ మీడియాలో పోస్ట్​ చేసిన వీడియోలో చెప్పిన మాటలివి. ఇది ఒక్క మధుకర్ రెడ్డి బాధ కాదిదిమన దేశానికి చెందిన వందలాది మంది యువకులు సైబర్​ క్రిమినల్స్​ ఉచ్ఛులో చిక్కి అనుభవిస్తున్న నరకమిది.

కొన్నిసార్లు భారత ప్రభుత్వం చొరవతో సైబర్​ క్రిమినల్స్ చేతుల్లో చిక్కుకున్న యువకుల్లో కొందరు విముక్తి పొందుతున్నారు. తమ తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. అయితే, ఇప్పటికీ వేల సంఖ్యలో మన దేశానికి చెందిన యువకులు సైబర్ నేరగాళ్ల చేతుల్లో చిక్కుకుని నిత్యం నరకం అనుభవిస్తున్నారు. ఓ సీనియర్ పోలీసు అధికారి ద్వారా తెలిసిన ప్రకారం గడిచిన రెండేళ్లలో విజిటింగ్​ వీసాపై కాంబోడియా, థాయ్​ లాండ్​, మయన్మార్, వియత్నాం దేశాలకు వెళ్లిన దాదాపు 30వేల మంది భారతీయుల ఆచూకీ దొరకటం లేదు. వీళ్లంతా సైబర్​ బానిసత్వంలో ఉండి ఉంటారని ఆ అధికారి చెప్పారు.
సోషల్​ మీడియా…
ప్రధానంగా డేటా ఎంట్రీ ఆపరేటర్​ ఉద్యోగాల పేర యువకులను ట్రాప్​ చేస్తున్న సైబర్​ క్రిమినల్స్​ ఫేస్​ బుక్​, ఇన్​ స్టాగ్రాం, టెలిగ్రాం తదితర యాప్​ ల ద్వారా పని కానిస్తున్నారు. నెలకు లక్ష నుంచి రెండు లక్షల జీతం ఆసక్తి ఉన్నవారు సంప్రదించండి అంటూ తమ వివరాలు ఇస్తున్నారు. విదేశీ ఉద్యోగం మోజులో కాంటాక్ట్​ చేసిన వారిని విజిట్​ వీసాలపై మా వద్దకు వచ్చేయండి…ఎలాంటి సమస్య లేకుండా చూసుకుంమని చెప్పి పిలిపించుకుంటున్నారు.

ఏజెంట్ల ద్వారా…
సోషల్​ మీడియాలో వస్తున్న ఆఫర్లను చూసి కొందరు యువకులు సైబర్​ క్రిమినల్స్​ ట్రాప్​ పడుతుంటే మరికొన్నిసార్లు ఏజెంట్లు యువకులను తెలిసి తెలిసి విదేశీ ఉద్యోగాల పేర యువకులను సైబర్ క్రిమినల్స్​ వద్దకు చేరుస్తున్నారు. రెండు నుంచి మూడు లక్షల రూపాయలు తీసుకుని పాస్​ పోర్ట్​, వీసా సమకూర్చి యువకులను ఆయా దేశాల్లోని సైబర్​ నేరగాళ్ల వద్దకు పంపిస్తున్నారు.
వచ్చీరాగానే..

ఇలా ఉద్యోగం మోజులో తమ వద్దకు చేరుతున్న యువకుల నుంచి సైబర్​ క్రిమినల్స్​ ముందుగా పాస్ పోర్టులు, వీసాలు తీసేసుకుంటున్నారు. ఆ తరువాత సిటీలు, గ్రామాలకు దూరంగా నిర్జన ప్రదేశాల్లో తాము ఏర్పాటు చేసుకున్న సైబర్​ కేప్​ లకు తరలిస్తున్నారు. ఎన్ని రకాలుగా సైబర్​ నేరాలు చేయవచ్చన్న దానిపై అవగాహన కల్పిస్తున్నారు. అనంతరం మన దేశానికి చెందిన వారిని టార్గెట్​ చేయిస్తూ నేరాలు చేయమంటున్నారు.

ఒప్పుకోకపోతే…
సైబర్​ నేరాలు చేయటానికి ఎవరైనా ఒప్పుకోకపోతే సైబర్​ క్రిమినల్స్​ వారికి నరకం చూపిస్తున్నారు. రోజుల తరబడి ఆహారం ఇవ్వకుండా గదుల్లో నిర్భంధిస్తున్నారు. కర్రలు, ఇనుపరాడ్లతో చితకబాదుతున్నారు. కరెంట్​ షాకులు పెడుతున్నారు. సైబర్​ క్రిమినల్స్​ చేతుల్లో చిక్కి సహాయం కోసం సోషల్​ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన మధుకర్​ రెడ్డి ఇదే విషయాన్ని చెప్పాడు. సైబర్​ క్రిమినల్స్​ పెడుతున్న ఈ హింసలను భరించలేక చాలామంది ఇష్టం లేకున్నా సైబర్​ నేరాలు చేస్తున్నట్టు వివరించాడు.
భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి…

విదేశీ ఉద్యోగం మోజులో దేశంగాని దేశం వెళ్లి సైబర్ క్రిమినల్స్​ చేతుల్లో బందీలుగా మారి నిత్యం నరకం అనుభవిస్తున్న వారికి విముక్తి కల్పించటానికి భారత ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందని ఓ సీనియర్​ పోలీసు అధికారి చెప్పారు.భారత విదేశాంగ శాఖ ఆయా దేశాల్లోని దౌత్య కార్యాలయాల సిబ్బందిని సమన్వయం చేసుకుని చొరవ తీసుకున్నపుడే ఇది సాధ్యమవుతుందన్నారు.

ఇటీవల థాయ్​ లాండ్​ లో సైబర్​ క్రిమినల్స్ చేతుల్లో చిక్కిన 540మంది భారతీయులకు విముక్తి దొరకటంలో (వీళ్లలో తెలంగాణకు చెందిన 24మంది యువకులు ఉన్నారు) భారత విదేశాంగ శాఖదే కీలక పాత్ర అని చెప్పారు. థాయ్​ లాండ్​ లోని దౌత్య కార్యాలయ సిబ్బంది ద్వారా ఆ దేశ ప్రభుత్వానికి పరిస్థితిని వివరించినట్టు తెలిపారు. ఈ క్రమంలో థాయ్​ లాండ్​ ఆర్మీ రంగంలోకి దిగి యువకులను సైబర్​ క్రిమినల్స్​ చెర నుంచి విడిపించిందన్నారు.

తమ దృష్టికి వచ్చినపుడే కాకుండా భారత విదేశాంగ శాఖ ఈ తరహా చర్యలను నిరంతరం తీసుకుంటే వేలాది మంది యువకులకు విముక్తి దొరుకుతుందన్నారు. అదే సమయంలో విదేశీ ఉద్యోగం అనగానే ముందూ వెనకా ఆలోచించకుండా యువకులు దేశంగాని దేశం వెళ్ల వద్దని సూచించారు. భారత విదేశీ వ్యవహారాల శాఖకు చెందిన వెబ్​ సైట్​ https;//emigrate.gov.in అన్న వెబ్​ సైట్​ కు వెళ్లి వచ్చిన జాబ్​ ఆఫర్​ సరైందేనా? అన్న విషయాన్ని తనిఖీ చేసుకోవాలన్నారు.

ఉద్యోగం కోసం బయల్దేరి వెళ్లే ముందు ఆఫర్​ చేసిన విదేశీ కంపెనీ లేదా వ్యక్తిని లిఖితపూర్వక అగ్రిమెంట్ ఇవ్వాలని అడగాలని చెప్పారు. విద్యార్హతలు తక్కువగా ఉన్నా ఉద్యోగంలో పెట్టుకుంటామంటే అనుమానించాలన్నారు. ఇక, విదేశీ ఉద్యోగం మోజులో విదేశాలకు వెళ్లి ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే 1930 నెంబర్​ కు ఫోన్​ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. దాంతోపాటు www.cybercrime.gov.in అన్న వెబ్ సైట్​ కు కూడా వివరాలు అంద చేయవచ్చని తెలిపారు.

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..