Mahakumbh
జాతీయం

Mahakumbh : మహాకుంభమేళా.. శివరాత్రి రోజు 81 లక్షల మంది పుణ్యస్నానాలు..!

Mahakumbh : మహాకుంభమేళా చివరి దశకు చేరుకుంది. మహా శివరాత్రి (Shivratri) రోజుతో మహాకుంభమేళా ముగుస్తోంది. దీంతో శివరాత్రి పర్వదినాన పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు ఎక్కువగా ఆసక్తి చూపించారు. దాంతో ఈ ఒక్కరోజే 81 లక్షల మంది దాకా స్నానాలు ఆచరించారు. గత 45 రోజులుగా సాగుతున్న ఈ కుంభమేళాలో ఇప్పటి వరకు 62 కోట్ల మందికి పైగా స్నానాలు చేయడం విశేషం. గంగ, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం వద్దనే ఎక్కువగా స్నానాలు ఆచరించారు.

ఎంతో అట్టహాసంగా సాగిన ఈ మహా వేడుక నేటితో ముగిసింది. ప్రతి రోజూ దాదాపు కోటి మందికి పైగానే పుణ్యస్నానాలు చేసినట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇక శివరాత్రి రోజు త్రివేణి సంగమం మొత్తం హరహర మహాదేవ్ నినాదాలతో హోరెత్తింది. పుణ్య స్నానాలు చేసిన వారంతా గంగామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్ని రోజుల్లో స్నానం చేయడం కన్నా శివరాత్రి రోజు చేయడమే అత్యంత పవిత్రంగా భక్తులు భావిస్తున్నారు. మహా కుంభమేళాలో సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు స్నానాలు చేశారు.

 

Just In

01

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!