Thank You God. Wearing The Indian Jersey Fills Me With Gratitude Joy Pride: సుధీర్ఘకాలం అనంతరం టీమిండియా జట్టులోకి భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు. టీ20 వరల్డ్ కప్లో భారత జట్టులో చోటు సంపాదించుకున్న రిషబ్. 16 నెలల తర్వాత టీమిండియా జెర్సీ వేసుకుని ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలిపాడు.
వరల్డ్ కప్ జెర్సీ వేసుకున్న సంతోషంలో పంత్ దైవాన్ని గుర్తు చేసుకున్నాడు. తన మనసులోని మాటలని వ్యక్తపరుస్తూ ఇన్స్టాగ్రామ్లో ఈ డాషింగ్ బ్యాటర్ ఓ పోస్ట్ పెట్టాడు. పంత్ తన పోస్ట్లో పేసర్లు బుమ్రా, సిరాజ్, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్లతో కలిసి దిగిన ఫొటోలని పెట్టాడు. భగవంతుడా నీకు ధన్యవాదాలు. ఈ జెర్సీ వేసుకోన్నందుకు నా మనసంతా కృతజ్ఞతాభావం, సంతోషం, గర్వంతో నిండిపోయింది. దేశానికి ప్రాతినిధ్యం వహించడం కంటే గొప్ప ఫీలింగ్ ఇంకేముంటుందని పంత్ తన పోస్ట్కు క్యాప్షన్ రాసుకొచ్చాడు.
Also Read: హెడ్కోచ్ ఎంపికపై గంగూలీ సంచలన వ్యాఖ్యలు..!
ప్రస్తుతం పంత్ పోస్ట్ చేసిన ఆ పోస్ట్ సోషల్మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ఈ వార్త చూసిన క్రికెట్ లవర్స్, నెటిజన్స్ యువర్ రియల్లీ అంటూ కామెంట్లతో మనోడిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అంతేకాదు టీమిండియా తరపున బాగా ఆడి దేశానికి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నారు.
View this post on Instagram