Tuesday, July 2, 2024

Exclusive

Telangana: తీరు మారని ‘కాసు’పత్రులు

(జులై 1) నేడు జాతీయ వైద్యుల దినోత్సవం

Private Doctors Persecution from poor patients..today National Doctors day

అమ్మానాన్నలు పిల్లలకు జన్మనిస్తే ఆపదకాలంలో వైద్యులు మనకు పునర్జన్మను ఇస్తారు. ఒకప్పటి దశాబ్దాల కలరా నుంచి రీసెంట్ కరోనా దాకా వైద్యులు అందించిన సేవలు వెలకట్టలేనివి.. వైద్య వృత్తిని అంకిత భావంతో నిర్వర్తిస్తూ సమాజానికి వారి వంతు సేవలను అందిస్తున్నారు. సంవత్సరానికి 365 రోజులు రాత్రి పగలు అనే తేడా లేకుండా ప్రజల ఆరోగ్యం కోసం పాటుడతారు వైద్యులు, అర్థరాత్రి తలుపుతట్టి అర్థిస్తే చీకటిని సైతం లెక్క చేయకుండా రోగి కోసం ఆలోచిస్తారు. అలాంటి దేవుళ్లకి చేతులెత్తి మొక్కుతూ హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుదాం. నేడు డాక్టర్స్ డే. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని భారతదేశంలో డాక్టర్ బి. సి. రాయ్ పుట్టినరోజు జ్ఞాపకార్థం జూలై 1 న భారతదేశంలో జరుపుకుంటారు.

డబ్లుల కోసం పనిచేసే యంత్రాలు

వైద్యుడు అంటే ప్రాణాలు పోసే దేవుడిలా వైద్య సేవలందించాల్సిన డాక్టర్లు నేడు కమర్షియల్ గా డబ్బులు సంపాదించే యంత్రాలుగా తయారవుతున్నారు. ఎంబీబీఎస్ వైద్యులనుంచి ఆర్ఎంపీ వైద్యుల దాకా అందరిదీ కమర్షియల్ పంథానే.. మారుమూల పల్లెల్లో ప్రథమ చికిత్సలు అందించే ఆర్‌ఎంపీ, పీఎంపీలు పెద్ద పెద్ద ఆస్పత్రులతో సంబంధాలు పెట్టుకుని ఏజెంట్లుగా వ్యవహరిస్తూ భారీగా కమిషన్లు దండుకుంటున్నారు. చిన్న రోగమైనా ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరితే చాలు అవ సరం లేకున్నా స్కానింగులనీ, ఎక్స్‌రేలనీ, రక్తపరీక్షలనీ ఇలా రోగిని బెంబేలెత్తిస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు పట్టణాలు, మండల కేంద్రాల్లో సైతం ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న కొన్ని ప్రైవేటు ఆస్పత్రులపై వైద్యశాఖాధికారులు ఇటీవల దాడులు నిర్వహించినా ఈ కమీషన్ల దందాపై మాత్రం దృష్టి కేంద్రీకరించకపోవడం గమనార్హం. దందాతో అటు ఆర్‌ఎంపీలు, పీఎంపీలతో పాటు ఆసుపత్రుల యాజమాన్యం లక్షలు గడిస్తున్నా రోగులు మాత్రం ఆర్థికంగా ఇల్లు గుల్ల చేసుకుంటున్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు రోగులను పంపడం, అక్కడ అయిన బిల్లులో రావాల్సిన కమీషన్లు తీసుకోవడం నిత్య వ్యాపారంలా మారింది.

అవసరం లేకున్నా పరీక్షలు..

గతంలో ఉన్న ఆసుపత్రులకు తోడు ఇటీవల పుట్టుకొస్తున్న ఆసుపత్రు లు ఆర్‌ఎంపీలకు సిరి సంపదలను తెచ్చిపెడుతున్నాయి. అటు ఆర్‌ఎంపీ, పీఎంపీలకు భారీగా కమీషన్లు ఇచ్చి ఇటు రోగుల జేబులకు చిల్లులు పొడుస్తున్నారు. రోగుల ప్రాణాలను అడ్డం పెట్టుకొని దోపిడీ చేస్తున్న వైద్య వ్య వస్థపై ప్రజల్లో తీవ్రమైన అసహనం ఉన్నప్పటికీ ఏం చేయలేని పరిస్థితి. సాధారణ జబ్బుతో ఆసుపత్రికి వెళ్తే లేని పోని భయాందోళనలు సృష్టించి రోగిని ఆసుపత్రిలో అడ్మిట్‌ చేస్తున్నారు. లెక్క లేని పరీక్షలు చేయడం, అ వసరం లేకున్నా అడ్డగోలుగా మందులు ఇస్తూ రోగి జేబును గుల్ల చేస్తు న్నారు. ఆరోగ్యం బాగా లేక ఆసపత్రిలో చేరుతున్న రోగులకు బిల్లులు చూ సి మానసికంగా, ఆర్థికంగా కుదేలవుతున్నారు. ఇంతటి దోపిడీ జగిత్యాల పట్టణంలోని పలు ఆసుపత్రులు మొదలుకోని జిల్లాలోని కోరుట్ల, మెట్‌ప ల్లి, రాయికల్‌, దర్మపురి వంటి పట్టణాల్లోని పలు ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో కొనసాగుతోంది. కొన్ని ఆసుపత్రుల్లో సవ్యంగా వైద్యసేవలు అందుతున్న ప్పటికీ వ్యాపారదృక్పథంతో ఏర్పాటు చేసిన పలు ఆసుపత్రుల్లో డబ్బు సంపాదించడమే లక్ష్యంగా మారింది.

కమీషన్‌..కక్కుర్తి

జిల్లాలో పలు ప్రైవేట్‌ ఆసుపత్రుల దోపిడీ తారాస్థాయికి చేరింది. రోగి ని దోచి ఆర్‌ఎంపీ, మద్యవర్తికి కొంత ఆసుపత్రి యాజమాన్యం మరికొంత పంచుకుంటున్నారు. ఇది వరకు కాలంలో రోగులను ఆసుపత్రులకు పంపే ఆర్‌ఎంపీలకు అడపాదడపా గిఫ్ట్‌లు ఇచ్చేవారు. కానీ గడిచిన నాలుగైదు ఏళ్లుగా ఆర్‌ఎంపీలకు కమీషన్లు అడ్డగోలుగా పెంచేశారు. పోటాపోటీగా ప్రైవేటు యాజమాన్యాలు అక్రమ సంపాదనకు ఆశపడి పలువురు ఆర్‌ ఎంపీలను ఏజెంట్లుగా, మద్యవర్తులుగా నియమించుకుంటున్నారు. ఒక్కో ఆసుపత్రిలో ఒక్కో తీరుగా 15 నుంచి 20 శాతం కమీషన్లను అప్పజెపు తున్నారు. బహిరంగంగానే పలు ప్రైవేటు ఆసుపత్రులు మద్యవర్తులతో బే రసారాలు కుదుర్చుకుంటున్నాయి. జగిత్యాల పట్టణంలో పదికి పైగా, కోరు ట్ల పట్టణంలో అయిదారు, మెట్‌పల్లిలో సుమారు పది ఆసుపత్రుల్లో, ధర్మ పురి, రాయికల్‌ వంటి పట్టణాల్లో సైతం ఆర్‌ఎంపీలు, మద్యవర్తులకు అ డ్వాన్స్‌లు చెల్లించి ప్రోత్సహిస్తుండడం గమనార్హం. ముందుగానే డబ్బులు చెల్లించి రోగుల బిల్లుల నుంచి వచ్చే కమీషన్‌ను అందులో నుంచి మినహా యించుకుంటున్నారు. పలువురు ఆసుపత్రుల నిర్వాహకులు విదేశాలకు ట్రిప్‌లకు సైతం పంపిస్తున్నారంటే వ్యాపారం ఏ మేరకు నడుస్తుండో అ ర్థం చేసుకోవచ్చు.

అనధికార ఆసుపత్రులు..

తెలంగాణలోని పలు పల్లెలు, పట్టణాల్లో పలువురు ఆర్‌ఎంపీలు అనధికార ఆసుపత్రులను ఏర్పాటు చేసుకుంటున్నారు. పలువురు ఆర్‌ఎంపీలు ఆసుపత్రు లలో నాలుగు, అయిదు బెడ్లను ఏర్పాటు చేసుకొని వైద్యం చేస్తున్నారు. పరీక్షల పేరిట పరిచయం ఉన్న ల్యాబ్‌లకు రోగులను పంపి కమీషన్లు దండుకుంటున్నారు. రోగి పరిస్థితి కొద్దిగా తీవ్రంగా ఉంటే చాలు వెంటనే ఒప్పందం కుదుర్చుకున్న ప్రైవేటు ఆసుపత్రికి పంపడం..అక్కడి నుంచి కమీషన్‌ తీసుకోవడం..ఇదీ జరుగుతోంది.

Publisher : Swetcha Daily

Latest

Kishan Reddy: హిందూ ద్వేషి

- ప్రతిపక్ష నేతగా రాహుల్ వ్యాఖ్యలు దురదృష్టకరం - ఇన్నాళ్లూ బీజేపీ, మోదీపై...

Job Notifications: ఇక కొలువుల జాతర

- వరుస ఉద్యోగ నోటిఫికేషన్లకు సర్కారు సై - జాబ్ కేలండర్ తయారీలో...

Congress Party: ఢిల్లీలో తలసాని..

- కాంగ్రెస్‌లో చేరికకు యత్నాలు - అఖిలేష్ యాదవ్ ద్వారా రాయబారం - మంత్రి...

PM Narendra Modi: రాహుల్ గాంధీలా చేయొద్దు!

- ప్రధాని కుర్చీని దశాబ్దాల పాటు ఒకే కుటుంబం పాలించింది - మ్యూజియంలో...

Cabinet Expansion: 4న మంత్రివర్గ విస్తరణ

- కొత్తగా నలుగురికి అవకాశం - సామాజిక సమీకరణాలే కీలకం - మంత్రుల శాఖల్లో...

Don't miss

Kishan Reddy: హిందూ ద్వేషి

- ప్రతిపక్ష నేతగా రాహుల్ వ్యాఖ్యలు దురదృష్టకరం - ఇన్నాళ్లూ బీజేపీ, మోదీపై...

Job Notifications: ఇక కొలువుల జాతర

- వరుస ఉద్యోగ నోటిఫికేషన్లకు సర్కారు సై - జాబ్ కేలండర్ తయారీలో...

Congress Party: ఢిల్లీలో తలసాని..

- కాంగ్రెస్‌లో చేరికకు యత్నాలు - అఖిలేష్ యాదవ్ ద్వారా రాయబారం - మంత్రి...

PM Narendra Modi: రాహుల్ గాంధీలా చేయొద్దు!

- ప్రధాని కుర్చీని దశాబ్దాల పాటు ఒకే కుటుంబం పాలించింది - మ్యూజియంలో...

Cabinet Expansion: 4న మంత్రివర్గ విస్తరణ

- కొత్తగా నలుగురికి అవకాశం - సామాజిక సమీకరణాలే కీలకం - మంత్రుల శాఖల్లో...

Hyderabad:ఆదిల్ కు అండగా సీఎం

CM Reventh reddy Reassurance to cancer patient Mohammadd Adil క్యాన్సర్‌ బాధితుడు మహమ్మద్‌ ఆదిల్‌ను ఆదుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ కుటుంబానికి భరోసానిచ్చారు. శనివారం రేవంత్‌ వరంగల్‌ జిల్లా పర్యటనకు వెళ్లిన...

Hyderabad: దోచుకోవడమేనా ‘మీ సేవ’

అక్రమార్జనకు నిలయంగా మారిన ‘మీ సేవ ’ కేంద్రం ఎస్ టీ పీ ఆపరేటర్-2 పేరుతో లాగిన్ రాంగ్ రూట్ లో సర్టిఫికెట్ల జారీ ఎమ్మార్వో లాగిన్ ఐడి నుంచి ఆయన...

Hyderabad:బ్రాండ్ ఇమేజ్ .. ‘సౌండ్’డామేజ్

నగరవాసులకు నరకం చూపిస్తున్న సౌండ్ పొల్యూషన్ శబ్దకాలుష్యంలో దేశంలోనే 5వ స్థానంలో నిలిచిన హైదరాబాద్ నివాస ప్రాంతాల మధ్యే ఫంక్షన్ హాళ్ల నిర్వహణ డీజేలు, బ్యాండ్ మేళా సౌండ్ లతో దద్దరిల్లుతున్న...