Jagga Reddy: జగ్గారెడ్డి ఇలాంటి శపథం చేశారేంటి?..
Congress leader Jagga Reddy addressing a party meeting during a political event in Telangana
Telangana News, లేటెస్ట్ న్యూస్

Jagga Reddy: జగ్గారెడ్డికి ఏమైంది ఇలాంటి శపథం చేశారు?.. అన్నంత పనిచేస్తారా ఏంటి?

Jagga Reddy: అదృష్టం కలిసి రాలేదు, కానీ, ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే కచ్చితంగా మంత్రి అయ్యి ఉండేవారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి (Jagga Reddy). సంగారెడ్డి రాజకీయాల్లో (Sangareddy Politics) తలపండిన ఆయన గత ఎన్నికల్లో ఓటమిని ఆయన ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. సొంత నియోజకవర్గంలో పరాజయం పాలవ్వడంపై తన బాధను దాదాపు అన్ని వేదికలపైనా వెళ్లబోసుకుంటున్నారు. ఇదే కోవలో తాజాగా మరో షాకింగ్ ప్రకటన చేశారు. ‘స్వయానా రాహుల్ గాంధీ వచ్చి ప్రచారం చేసినా నన్ను గెలిపించలేదు.. ఇకపై సంగారెడ్డి నుంచి నేను పోటీ చేయను’’ అంటూ ఆయన భావోద్వేగపూరిత శపథం చేశారు. తన భార్య పోటీ చేసినా నియోజకవర్గంలో పోటీ చేయబోనని అంటున్నారు. జీవితంలో ఈ ఓటమి మరిచిపోలేనిదని, ఓటమికి కారణం పేద ప్రజలు కాదన్నారు. సంగారెడ్డిలోని మేధావులు, పెద్దలే ఇందుకు కారణమని తప్పుబట్టారు. అయితే, అసలు పోటీ చేయబోనంటూ శపథం చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Read Also- AR Rahman: ముస్లిం అయిన మీరు ‘రామాయణ’కు ఎందుకు వర్క్ చేస్తున్నారని అడిగితే..

వారసత్వ రాజకీయానికి సంకేతం?

తాను పోటీ చేయబోనంటూ జగ్గారెడ్డి శపథం చేశారు. కానీ, తన భార్య నిర్మలా రెడ్డి పోటీ చేసినా ప్రచారం చేయబోనని అన్నారు. అంతేకానీ, ఆ నియోజకవర్గాన్ని తన కుటుంబం వదిలేస్తుందని మాత్రం ఆయన చెప్పడం లేదు. దీంతో, తాను ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండి, తన కుటుంబ సభ్యులను రంగంలోకి దించి, తద్వారా నియోజకవర్గంపై పట్టు కోల్పోకుండా చూసుకోవాలని వ్యూహం పన్నుతున్నారా? అని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. భార్యను అసెంబ్లీ నియోజకవర్గానికి పరిమితం చేసి, ఎంపీగా ఏమైనా పోటీ చేస్తారా?, లేక, తన పలుకుబడి ఉపయోగించి రాష్ట్రంలోని మరే నియోజకవర్గం నుంచైనా రంగంలోకి దిగుతారా? అనేది ఆసక్తికరంగా మారింది.

Read Also- Rangareddy Congress: రంగారెడ్డి జిల్లాలో విచిత్ర రాజకీయం.. అధిష్టానం ఆదేశాలను లెక్కచేయని జిల్లా నేతలు

సంగారెడ్డితో ప్రజలతో అనుబంధం

జగ్గారెడ్డి తనను తాను కేవలం ఒక నాయకుడిగా కంటే సంగారెడ్డి బిడ్డనని చెప్పుకుంటుంటారు. ఇలా చెప్పుకోవడం రాజకీయ ఎత్తుగడే కావచ్చు. కానీ, సుదీర్ఘంగా అక్కడి రాజకీయాల్లో ఉండడంతో అక్కడి ప్రజలతో ఆయనకు అనుబంధం ఉంది. అలాంటి తనను రాహుల్ గాంధీ వచ్చి విజ్ఞప్తి చేసినా ప్రజలు గెలిపించలేదనేది ఆయన ఆవేదనగా కనిపిస్తోంది. అయితే, వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జనాలను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారా?, లేక, నిజంగా సంగారెడ్డి ప్రజలకు దూరమవుతారా? అనేది తదుపరి అసెంబ్లీల్లోనే క్లారిటీ రానుంది.

Just In

01

Ram Charan: తారక్‌తో స్నేహంపై మరోసారి చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

BJP Politics: కిషన్ రెడ్డి వర్సెస్ ఈటల!.. కేంద్ర మంత్రి మద్దతిస్తే.. వ్యతిరేకిస్తున్న ఎంపీ.. విషయం ఏంటంటే?

VV Vinayak: ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చూసిన మాస్ డైరెక్టర్ స్పందనిదే..

Plane Missing: ఇండోనేషియాలో విమానం మిస్సింగ్.. కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్.. ప్లేన్‌లో ఎంతమంది ఉన్నారంటే

Challa Narasimha Reddy: పేదల పొట్ట కొట్టేందుకు కేంద్రం కుట్ర చేస్తుంది: చల్లా నరసింహారెడ్డి