Daggubati Family Case: దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసులో నేడు టాలీవుడ్ హీరోలు దగ్గుబాటి వెంకటేశ్(Venkatesh), దగ్గుబాటి రాణా(Rana)తోపాటు నిర్మాత దగ్గుబాటి సురేష్(Suresha), అభిరాంలు నాంపల్లి కోర్టుకు రానున్నారు. ఇప్పటికే కోర్టు ఆదేశాలతో ఈ నలుగురిపై ఫిలింనగర్ పోలీసులు ఐపీసీ 448, 452, 458, 120 బీ సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు. ఫిలింనగర్ లోని దక్కన కిచెన్ హోటల్ స్థలానికి సంబంధించి దాని యజమాని నందకుమార్.. దగ్గుబాటి కుటుంబం మధ్య గతంలో వివాదం తలెత్తిన విషయం తెలిసిందే.
హైకోర్టు ఆదేశాలను లెక్క చేయలేదు..
ఈ నేపథ్యంలో నందకుమార్(Nandakumar) సిటీ సివిల్ కోర్టులో కేసు వేశారు. కాగా, 2022, నవంబర్ లో జీహెచ్ఎంసీ(GHMC) సిబ్బంది, బౌన్సర్లతో కలిసి వచ్చిన దగ్గుబాటి బ్రదర్స్ హోటల్ ను పాక్షికంగా కూల్చి వేశారు. సదరు స్థలంలో ఎలాంటి చర్యలకు దిగొద్దన్న హైకోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయలేదు. ఇక, 2024, జనవరిలో మొత్తం హోటల్ ను కూల్చి వేశారు. దాంతో నందకుమార్(Nandakumar) వీరిపై కేసులు నమోదు చేయాలని నాంపల్లిలోని 17వ అదనపు ఛీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిని విచారణకు స్వీకరించిన కోర్టు హీరోలు దగ్గుబాటి వెంకటేశ్, దగ్గుబాటి రాణా, నిర్మాత దగ్గుబాటి సురేశ్, అభిరాంలపై కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
Also Read: Viral Video: ఏనుగులనే హడలెత్తించిన.. డాడీ లిటిల్ ప్రిన్సెస్.. మీకో దండం తల్లి!
విచారణను సెప్టెంబర్ 10కి వాయిదా..
ఈ మేరకు ఫిలింనగర్ పోలీసులు(Filmnagar Police) కేసులు పెట్టారు. కాగా, కోర్టులో జరుగుతున్న కేసు విచారణకు ఇప్పటివరకు ఈ నలుగురు హాజరు కాలేదు. ఆగస్టు 1న జరిగిన విచారణకు కూడా రాకపోవటంతో కోర్టు దీనిపై సీరియస్ అయ్యింది. దాంతో దగ్గుబాటి బ్రదర్స్ తదుపరి విచారణకు తప్పనిసరిగా హాజరవుతారని వారి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో విచారణను సెప్టెంబర్ 10కి వాయిదా వేస్తూ ఆ రోజు ఖచ్చితంగా నలుగురు కోర్టుకు రావాల్సిందేనని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే నేడు దగ్గుబాటి వెంకటేశ్, దగ్గుబాటి రాణా, దగ్గుబాటి సురేశ్, అభిరాంలు నాంపల్లి కోర్టుకు రానున్నారు. ఈసారి కూడా విచారణకు ఈ నలుగురు హాజరు కాకపోతే కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసే అవకాశముందని న్యాయవాదులు అంటున్నారు.
Also Read: Bellamkonda Sai Srinivas: వారి వల్లే సినిమాకు అలా జరిగింది.. అలా అనే సరికి బాధేస్తోంది