Kamareddy District [ image credit: twittr]
తెలంగాణ

Kamareddy District: పండుగ పూట విషాదం.. తల్లి, ముగ్గురు పిల్లలు మృతి.. ఎలాగంటే?

కామారెడ్డి స్వేచ్ఛ : Kamareddy District: ఉగాది పండుగపూట విషాదం నెలకొంది. నీటి మునిగి నలుగురు మృతి చెందిన ఘటన ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్ గ్రామ శివారులోని పెద్ద చెరువు బ్యాక్వాటర్లో చోటుచేసుకుంది. ఎల్లారెడ్డి సీఐ రవీందర్, ఎస్సై మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని భిక్కనూరు గ్రామ పరిధిలో గల వెంకటాపూర్కు చెందిన మౌనిక(26) ముగ్గురు పిల్లలు మైతిలి(10), అక్షర(9), వినయ్(7)లతో కలిసి శనివారం మధ్యాహ్నం పొలం పనుల నిమిత్తం వెళ్లారు. అనంతరం చెరువు వద్దకు వెళ్లి మౌనిక దుస్తులు ఉతుకుతుండగా.. పిల్లలు స్నానం చేసేందుకు చెరువులో దిగారు.

కాగా.. చెరువులో భారీ గుంత ఉండడంతో పిల్లలు అందులో మునిగిపోయారు. వారిని గమనించిన పినతల్లి మౌనిక కాపాండేందుకు వెళ్లి ఆమె కూడా నీట మునిగింది. సాయంత్రం దాటినా నలుగురు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అనంతరం చెరువు వద్దకు వెళ్లి చూడగా దుస్తులు కనిపించినా ఎవరి ఆచూకీ కనిపించలేదు.

 Also Read: CBI Case on IT officers: ఆదాయపన్ను శాఖలో అవినీతి తిమింగలాలు.. పట్టేసిన సీబీఐ.. కేసులు నమోదు

దీంతో కుటుంబీకులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి తర్వాత వినయ్ మృతదేహం నీటిపై తేలింది. దీంతో మిగతా వారికోసం గాలించగా ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరి మృతదేహాలను పోస్టుమార్టం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నలుగురి మృతితో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ  https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?