Kamareddy District: పండుగ పూట విషాదం.. తల్లి, ముగ్గురు పిల్లలు
Kamareddy District [ image credit: twittr]
Telangana News

Kamareddy District: పండుగ పూట విషాదం.. తల్లి, ముగ్గురు పిల్లలు మృతి.. ఎలాగంటే?

కామారెడ్డి స్వేచ్ఛ : Kamareddy District: ఉగాది పండుగపూట విషాదం నెలకొంది. నీటి మునిగి నలుగురు మృతి చెందిన ఘటన ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్ గ్రామ శివారులోని పెద్ద చెరువు బ్యాక్వాటర్లో చోటుచేసుకుంది. ఎల్లారెడ్డి సీఐ రవీందర్, ఎస్సై మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని భిక్కనూరు గ్రామ పరిధిలో గల వెంకటాపూర్కు చెందిన మౌనిక(26) ముగ్గురు పిల్లలు మైతిలి(10), అక్షర(9), వినయ్(7)లతో కలిసి శనివారం మధ్యాహ్నం పొలం పనుల నిమిత్తం వెళ్లారు. అనంతరం చెరువు వద్దకు వెళ్లి మౌనిక దుస్తులు ఉతుకుతుండగా.. పిల్లలు స్నానం చేసేందుకు చెరువులో దిగారు.

కాగా.. చెరువులో భారీ గుంత ఉండడంతో పిల్లలు అందులో మునిగిపోయారు. వారిని గమనించిన పినతల్లి మౌనిక కాపాండేందుకు వెళ్లి ఆమె కూడా నీట మునిగింది. సాయంత్రం దాటినా నలుగురు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అనంతరం చెరువు వద్దకు వెళ్లి చూడగా దుస్తులు కనిపించినా ఎవరి ఆచూకీ కనిపించలేదు.

 Also Read: CBI Case on IT officers: ఆదాయపన్ను శాఖలో అవినీతి తిమింగలాలు.. పట్టేసిన సీబీఐ.. కేసులు నమోదు

దీంతో కుటుంబీకులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి తర్వాత వినయ్ మృతదేహం నీటిపై తేలింది. దీంతో మిగతా వారికోసం గాలించగా ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరి మృతదేహాలను పోస్టుమార్టం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నలుగురి మృతితో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ  https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?