Election Commission: ఎన్నికల సంఘం నుంచి.. సరికొత్త విధానం?
Election Commission (imagecredit:twitter)
Telangana News

Election Commission: ఎన్నికల సంఘం నుంచి.. ఈసీఐఎన్ఈటీతో సరికొత్త విధానం?

Election Commission: భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఓటరు టర్నవుట్ నివేదికల విధానంలో సరికొత్త మార్పు తీసుకొచ్చింది. ప్రిసైడింగ్ అధికారులు (పీఆర్వోలు) ఇకపై ప్రతి రెండు గంటలకు సుమారు ఓటరు టర్నవుట్ డేటాను నేరుగా ఈసీఐఎన్ఈటీ అనే కొత్త యాప్ ద్వారా నమోదు చేయనున్నారు. ఈ సాంకేతికతతో కూడిన విధానం పాత మాన్యువల్ విధానంలో ఉన్న ఆలస్యాన్ని తగ్గించి, వేగవంతమైన, ఖచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు అందిస్తుందని ఎన్నికల సంఘం ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.

టర్నవుట్ డేటాను నమోదు

కొత్త విధానం ప్రకారం, పీఆర్వోలు ఓటింగ్ సమయంలో మరియు ఓటింగ్ ముగిసిన వెంటనే, పోలింగ్ స్టేషన్ నుంచి బయలుదేరే ముందు ఈ యాప్‌లో టర్నవుట్ డేటాను నమోదు చేస్తారు. ఈ డేటా నియోజకవర్గ స్థాయిలో స్వయంచాలకంగా సమీకరించబడి, అప్‌డేట్ చేయబడిన ఓటర్టర్నవుట్ (వీటీఆర్) యాప్‌లో ప్రతిబింబిస్తుంది. మొబైల్ నెట్‌వర్క్ లేని ప్రాంతాల్లో ఈ యాప్ ఆఫ్‌లైన్‌లో డేటా నమోదును ఇవ్వనున్నది. ఆ తర్వాత నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చిన వెంటనే ఆటో-సింక్ అవుతుంది.

Also Read: Bhu Bharati Act: దేశంలోనే భూభారతి చట్టం.. అగ్రగామిగా నిలుస్తోంది!

1961 ఎన్నికల నియమావళి ప్రకారం

ఈ కొత్త విధానం చట్టబద్ధమైనది కాదని, అయితే 1961 ఎన్నికల నియమావళి ప్రకారం రూల్ 49ఎస్ కింద పీఆర్వోలు ఫారం 17సీని పోలింగ్ ఏజెంట్లకు అందజేయాల్సిన చట్టపరమైన అవసరాన్ని ఇది పూర్తిగా పాటిస్తుందని సంఘం స్పష్టం చేసింది. ఆ చట్టపరమైన విధానంలో ఎలాంటి మార్పు లేదు. పాత విధానంలో సెక్టార్ అధికారులు రిటర్నింగ్ అధికారులకు ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్, లేదా మెసేజింగ్ యాప్‌ల ద్వారా డేటాను పంపేవారు, దీనివల్ల నాలుగు నుంచి ఐదు గంటల వరకు ఆలస్యం జరిగేది. కొత్త విధానం ఈ సమస్యను పరిష్కరిస్తూ, రాబోయే బీహార్ ఎన్నికలకు ముందే అమలులోకి వస్తుంది. దీనివల్ల పారదర్శకత పెరగడమే కాకుండా, ఆలస్యమైన నివేదికల వల్ల వచ్చే తప్పుడు సమాచారాన్ని తగ్గించవచ్చని ఎన్నికల సంఘం భావిస్తోందనీ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెల్లడించారు.

Also Read: Telugu States: తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త పంచాయితీ.. చంద్రబాబు, రేవంత్ ఏం తేల్చుకుంటారో?

 

Just In

01

Bigg Boss Telugu 9: భరణి ఇమిటేషన్ అదుర్స్.. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ లోడింగ్..

KTR Vs Congress: ఉప్పల మల్లయ్య ఇంటికి వెళ్లి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Itlu Arjuna: ‘న్యూ గయ్ ఇన్ టౌన్’ ఎవరో తెలిసిపోయింది.. ‘సోల్ ఆఫ్ అర్జున’ వచ్చేసింది

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!