TG Govt: రాష్ట్ర ప్రభుత్వం ఎంపీటీసీల లెక్కను అధికారికంగా ప్రకటించింది. రాష్ట్రంలో 5,773 ఎంపీటీసీ స్థానాలు, ఎంపీపీ, జెడ్పీటీసీ 566, జెడ్పీ 31 ఉన్నట్లు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 30వ తేదీలోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలతో అధికారులు స్థానిక ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేశారు. అందులో భాగంగానే ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలను ఖరారు చేశారు. నల్లొండలో అత్యధికంగా 353 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి.
ఆ తర్వాత నిజామాబాద్లో 307, అత్యల్పంగా ములుగు జిల్లాలో 83, ఆ తర్వాత జయశంకర్ భూపాలపల్లిలో 109 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఎంపీపీ, జెడ్పీటీసీలు స్థానాలు సైతం అత్యధికంగా నల్గొండ జిల్లాలో 33 ఉన్నాయి. అత్యల్పంగా ములుగులో 10 ఉన్నాయి. ఎన్నికల మెటీరియల్ సిద్ధం చేయాలని కలెక్టర్లకు, జెడ్పీ సీఈఓలు, డీపీఓలకు పంచాయతీ రాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం నుంచి ప్రకటన ఎప్పుడొచ్చినా రెడీగా ఉండాలని పేర్కొన్నది. మెటీరియల్ను సైతం తీసుకెళ్లాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
Also Read: Local Body Elections: నేటి నుంచి జిల్లా పర్యటనలు.. రాంచందర్ రావు అధ్యక్షతన సమావేశాలు
పక్కా లెక్కలు
ప్రభుత్వం ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీలతోపాటు గ్రామ పంచాయతీలు, వార్డుల లెక్కను తేల్చింది. 2019 ఎన్నికల్లో ఎంపీటీసీ స్థానాలు 5,817 ఉండగా ప్రస్తుతం 5,773, ఎంపీపీలు, జెడ్పీటీసీలు 539 ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 566కు చేరింది. గతం కంటే ఎంపీటీసీలు 44 స్థానాలకు పడిపోగా, ఎంపీపీలు, జెడ్పీటీసీలు మాత్రం 27 వరకు పెరిగాయి. గతంలో 32 జెడ్పీ స్థానాలు ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 31కి చేరింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని అన్ని గ్రామాలు, మండలాలు శివారు మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో విలీనం కావడంతో ఈ జిల్లా స్థానిక ఎన్నికల ప్రక్రియ నుంచి ఔట్ అయ్యింది. 2019లో 12,848 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా ప్రస్తుతం వాటి సంఖ్య 12,778కు చేరింది. 2019లో గ్రామాల వార్డులు 1,13,136 ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 1,12,694కు చేరుకున్నది.
పోలింగ్ సిబ్బంది డాటా సిద్ధం చేయాలి
గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల కోలాహలం నెలకొన్నది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పోలింగ్ సిబ్బంది డాటాను సిద్ధం చేయాలని కలెక్టర్లకు ఎన్నికల సంఘం కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో నమోదైన రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్, ప్రిసైడింగ్ అధికారులు, ఇతర సిబ్బంది వివరాలను మరోసారి పరిశీలించాలని ఈసీ సూచించింది. రాష్ర్టంలోని జిల్లా, రెవెన్యూ, డివిజన్, మండలం, పంచాయతీలతోపాటు వార్డుల సంఖ్య ఆధారంగా పూర్తి వివరాలను అందుబాటులో ఉంచాలని కలెక్టర్లకు ఎన్నికల సంఘం ఆదేశించింది.
జిల్లా ఎంపీటీసీలు ఎంపీపీలు, జెడ్పీటీసీలు
❄️ఆదిలాబాద్ 166 20 20
❄️భద్రాద్రి కొత్తగూడెం 233 22 22
❄️హన్మకొండ 129 12 12
❄️జగిత్యాల 216 20 20
❄️జనగామ 134 12 12
❄️జయశంకర్ భూపాలపల్లి 109 12 12
❄️జోగులాంబ గద్వాల 142 13 13
❄️కామారెడ్డి 233 25 25
❄️కరీంనగర్ 170 15 15
❄️ఖమ్మం 283 20 20
❄️ఆసిఫాబాద్ 127 15 15
❄️మహుబూబాబాద్ 193 18 18
❄️మహుబూబ్ నగర్ 175 16 16
❄️మంచిర్యాల 129 16 16
❄️మెదక్ 190 21 21
❄️ములుగు 83 10 10
❄️నాగర్ కర్నూల్ 214 20 20
❄️నల్గొండ 353 33 33
❄️నారాయణపేట 136 13 13
❄️నిర్మల్ 157 18 18
❄️నిజామాబాద్ 307 31 31
❄️పెద్దపల్లి 137 13 13
❄️రాజన్న సిరిసిల్ల 123 12 12
❄️రంగారెడ్డి 230 21 21
❄️సంగారెడ్డి 271 26 26
❄️సిద్దిపేట 230 26 26
❄️సూర్యాపేట 235 23 23
❄️వికరాబాద్ 227 20 20
❄️వనపర్తి 133 15 15
❄️వరంగల్ 130 11 11
❄️యాద్రాద్రి భువనగిరి 178 17 17
Also Read: Local Body elections: స్థానిక సంస్థల ఎన్నికలపై.. కీలక తీర్పు ఇచ్చిన హైకోర్టు