Opal Suchata Chuangsri: మిస్ వరల్డ్ కు గవర్నర్ సన్మానం..
Opal Suchata Chuangsri( image credit: swetcha reporter)
Telangana News

Opal Suchata Chuangsri: మిస్ వరల్డ్ కు గవర్నర్ సన్మానం.. హాజరైన సీఎం మంత్రులు!

Opal Suchata Chuangsri: రాజ్ భవన్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గవర్నర్ జిష్టుదేవ్ వర్మ తేనేటి విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. అదే విధంగా విస్ వరల్డ్-2025 విజేత థాయ్ లాండ్ సుందరి ఓపల్ సుచాతా చువాంగ్ శ్రీ, మొదటిరన్నరప్ హాసెట్ డెరెజే ఇథియోపియా, రెండో రన్నరప్ పోలాండ్ మాయా క్లైడా, మూడో రన్నరప్ మార్టినిక్ ఆరేలి జోచిమ్ పాల్గొన్నారు.

Also Read: Kaleshwaram project: కేసీఆర్ డేట్ మార్పు.. కోరిన సమయానికి ఓకే అన్న కమిషన్!

సుచాతా కు గవర్నర్ దంపతులు సన్మానం చేశారు. సుందరీమణులతో గవర్నర్ మాట్లాడారు. తెలంగాణ ప్రాంతాలు వికసిత్ భారత్ ను సూచిస్తాయని, మీరు వెళ్లాక తెలంగాణ గురించి చెప్పడానికి చాలా విషయాలు ఉంటాయని పేర్కొన్నారు. దీనికి స్పందించిన మిస్ వరల్డ్ సుచాతా మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు బాగున్నాయన్నారు. తెలంగాణ ఎప్పటికీ మనసులో నిలిచిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభ స్పీకర్ ప్రసాద్ కుమార్, రాజ్ భవన్ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

Also Read: NEET Exam: నీట్ పరీక్ష వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..?

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..