Duddilla Sridhar Babu: ఐటీ ఫార్మా క్రీడల్లో సహకారానికి తెలంగాణ
Duddilla Sridhar Babu (image credit: swetcha reporter)
Telangana News

Duddilla Sridhar Babu: ఐటీ ఫార్మా క్రీడల్లో సహకారానికి తెలంగాణ సంసిద్ధం.. క్యూబా రాయబారితో మంత్రి శ్రీధర్ బాబు భేటీ

Duddilla Sridhar Babu: ద్వైపాక్షిక సహకారంతో నైపుణ్యాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకొని, ఉమ్మడి పురోగతి వైపు కలిసి అడుగేద్దామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు  అన్నారు. తెలంగాణ – క్యూబా సత్సంబంధాలను పెంపొందించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. క్యూబా రాయబారి జువాన్ కార్లోస్ మార్సన్ అగులేరా, ఫస్ట్ సెక్రటరీ మిక్కీ డియాజ్ పెరెజ్ తో మంగళవారం సచివాలయంలో భేటీ అయ్యారు. బయో టెక్నాలజీ, ఫార్మా, హెల్త్ కేర్, ఐటీ, ఏఐ, ఇన్నోవేషన్, అగ్రికల్చర్, సస్టైనబుల్ ఫార్మింగ్, స్పోర్ట్స్ ఎక్స్ లెన్స్, కల్చర్ తదితర అంశాల్లో ద్వైపాక్షిక సహకారం, నైపుణ్య మార్పిడికి గల అవకాశాలపై చర్చించారు.

Also Read: Duddilla Sridhar Babu: తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి.. ఒరికా ప్రతినిధులకు మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి!

ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంతర్జాతీయ భాగస్వామ్యాలతో తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. టీ-హబ్, టీ-వర్క్స్, వీ-హబ్ ద్వారా క్యూబా స్టార్టప్స్ కు మార్గనిర్దేశం చేసేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందన్నారు. ఏఐ ఆధారిత డయాగ్నోస్టిక్స్, ఫార్మా రీసెర్చ్, పబ్లిక్ హెల్త్ డేటా తదితర అంశాల్లో సహకారం అందిస్తామన్నారు. జీనోమ్ వ్యాలీని సందర్శించాలని క్యూబా ప్రతినిధులను ఆహ్వానించారు. తెలంగాణతో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నామని క్యూబా రాయబారి జువాన్ కార్లోస్ మార్సన్ అగులేరా పేర్కొన్నారు.

Also Read: Duddilla Sridhar Babu: తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి.. ఒరికా ప్రతినిధులకు మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి!

Just In

01

Actor Sivaji: నటుడు శివాజీపై మహిళా కమిషన్​ సీరియస్.. చర్యలు తప్పవ్!

Aadi Sai Kumar: ‘శంబాల’ ఉందా? లేదా? అనేది తెలీదు కానీ, ‘కల్కీ’ తర్వాత ఆ పేరు వైరలైంది

AP CM Chandrababu Naidu: ఏపీ నుంచి ఎవరైనా నోబెల్ సాధిస్తే.. వారికి రూ. 100 కోట్లు ఇస్తా! మళ్లీ అదే సవాల్!

Ramchander Rao: ఇరిగేషన్ ప్రాజెక్టులపై అధ్యయన కమిటీ వేస్తాం : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

Uttam Kumar Reddy: పదేళ్లలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేశారా? తీవ్రస్థాయిలో మండిపడ్డ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి!