Fake Certificates: నకిలీ సర్టిఫికెట్ల దందా చేస్తున్న ఇద్దరిని సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి వేర్వేరు వర్సిటీలకు చెందిన నకిలీ సర్టిఫికెట్లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీ అందె శ్రీనివాస రావు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఫస్ట్ లాన్సర్ సయ్యద్ నగర్ నివాసి మహ్మద్ ఖాదర్ ఎలియాస్ జునైద్ (27) బిటెక్ చదువుతూ మధ్యలో వదిలేశాడు. అయితే, అమెరికా వెళ్లి స్థిరపడాలన్న కోరికతో మహ్మద్ ఖాదర్ తలాబ్ కట్ట అమాన్ నగర్ నివాసి, హోం ట్యూటర్ అయిన సయ్యద్ ఇమ్రాన్ ఎలియాస్ ప్రొఫెసర్ (40)ను సంప్రదించాడు. తనకు ఏదైనా డిగ్రీ సర్టిఫికెట్ ఇప్పించాలని అడిగాడు.
Also Read: Phone Tapping Case: ఇక ప్రభాకర్ రావు వంతు.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మూసుకుపోయిన దారులు!
ఈ క్రమంలో సయ్యద్ ఇమ్రాన్ అతని నుంచి 80వేల రూపాయలు తీసుకుని ఝాన్సీలోని బుందేల్ ఖండ్ వర్సిటీ నుంచి బీబీఏ చదివినట్టుగా సర్టిఫికెట్ ఇచ్చాడు. ఈ క్రమంలో మహ్మద్ ఖాదర్ సర్టిఫికెట్లు కావాలనుకున్న మరికొందరిని కూడా సయ్యద్ ఇమ్రాన్ వద్దకు తీసుకొచ్చాడు. ఈ ఇద్దరు మాసాబ్ ట్యాంక్ నెహ్రూ చాచా పార్క్ వద్ద నకిలీ సర్టిఫికెట్లు ఇస్తుండగా సమాచారాన్ని సేకరించిన సీఐ సైదాబాబు, మాసాబ్ ట్యాంక్ సీఐ ప్రవీణ్ కుమార్ తోపాటు ఎస్సైలు కవియుద్దీన్, సాయిరాం, మధు, సతీష్ లతోపాటు సిబ్బందితో కలిసి దాడి చేసి పట్టుకున్నారు. వారి నుంచి వేర్వేరు వర్సిటీలకు చెందిన 36 నకిలీ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నారు.
Also Read: Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్..సెక్రటేరియట్ లో సమావేశానికి రైతులకు పిలుపు!
సయ్యద్ ఇమ్రాన్ ను విచారించగా తన వద్దకు ఎవరైనా సర్టిఫికెట్లు కావాలని వస్తే వారి నుంచి డబ్బు తీసుకుని వివరాలను ఢిల్లీ నజఫ్ ఘడ్ నివాసి రోహన్ ఎలియాస్ శ్యాంలాల్ కు వాట్సాప్ ద్వారా పంపించేవాన్నని చెప్పాడు. రోహన్ నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి తనకు కొరియర్ ద్వారా పంపించే వాడని తెలిపాడు. ఈ క్రమంలో పోలీసులు రోహన్ పై కూడా కేసులు నమోదు చేశారు. అరెస్ట్ చేసిన మహ్మద్ ఖాదర్, సయ్యద్ ఇమ్రాన్ లను తదుపరి దర్యాప్తు నిమిత్తం మాసాబ్ ట్యాంక్ పోలీసులకు అప్పగించారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈhttps://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు