Phone Tapping Case( iamge credit: twitter or free pic)
తెలంగాణ

Phone Tapping Case: ఇక ప్రభాకర్ రావు వంతు.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మూసుకుపోయిన దారులు!

Phone Tapping Case: రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫోన్​ ట్యాపింగ్​ కేసులోని ప్రధాన నిందితునిగా ఉన్న ప్రభాకర్​ రావును స్వదేశానికి రప్పించేందుకు దర్యాప్తు అధికారులు చర్యలను ముమ్మరం చేశారు. ఇప్పటికే ఆయన పాస్​ పోర్టును రద్దు చేయించిన అధికారులు సీబీఐ ద్వారా రెడ్​ కార్నర్ నోటీసును కూడా జారీ చేయించారు. కాగా, అరెస్టు నుంచి తప్పించుకోవటానికి ప్రభాకర్​ రావు కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తనకు ముందస్తు బెయిల్​ మంజూరు చేయాలని త్వరలోనే సుప్రీం కోర్టులో ఆయన పిటిషన్​ దాఖలు చేయనున్నట్టు సమాచారం. కాగా, తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలంటూ ఇప్పటికే ఆయన అమెరికన్​ ప్రభుత్వానికి లిఖిత పూర్వక విజ్ఞప్తి చేసినట్టుగా సమాచారం.

విమర్శలు వస్తుండటంతో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీంట్లో ప్రధాన నిందితునిగా ఉన్న ప్రభాకర్​ రావు కేసులు నమోదు కాగానే అమెరికా పారిపోయారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్న సిట్​ విచారణకు హాజరు కావాలని పలుమార్లు నోటీసులు జారీ చేసినా ఆయన స్పందించలేదు.

పద్దెనిమిది నెలలు గడిచిపోతున్నా ప్రభాకర్​ రావును వెనక్కి రప్పించ లేకపోతున్న దర్యాప్తు అధికారుల తీరుపై అన్ని వర్గాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభాకర్​ రావును ప్రశ్నించినపుడే ఫోన్​ ట్యాపింగ్​ వెనక ఉన్న అసలు సూత్రధారుల పేర్లు బయటకు వస్తాయని పోలీసు వర్గాలు సైతం అంటున్నాయి. దర్యాప్తు అధికారుల వ్యవహార శైలిపై ప్రభుత్వం కూడా ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం.

 Also Read: Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్..సెక్రటేరియట్ లో సమావేశానికి రైతులకు పిలుపు!

ఈ నేపథ్యంలోనే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభాకర్​ రావును వెనక్కి రప్పించాలని నిర్ణయం తీసుకున్న సిట్​ ఈ దిశగా చర్యలను ముమ్మరం చేసింది. ఇప్పటికే ప్రభాకర్​ రావు పాస్​ పోర్టును రద్దు చేయించింది. అదే సమయంలో సీబీఐ ద్వారా రెడ్​ కార్నర్​ నోటీసును జారీ చేయించింది. ప్రభాకర్​ రావుపై నమోదైన కేసు వివరాలతో ఉన్న ఈ రెడ్​ కార్నర్​ నోటీస్​ ఇప్పటికే ఇంటర్​ పోల్​ కు చేరినట్టుగా సమాచారం. భారత విదేశీ మంత్రిత్వ శాఖతో మాట్లాడటం ద్వారా ఈ రెడ్​ కార్నర్​ నోటీస్​ వెంటనే అమలయ్యేలా చూసేందుకు అధికారులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇవి సఫలమైతే అమెరికా ప్రభుత్వం ప్రభాకర్ రావును డిపోట్​ చేస్తుందని అధికారులు చెబుతున్నారు.

కాగా, అరెస్ట్​ నుంచి తప్పించుకునుందుకు ప్రభాకర్​ రావు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీంట్లో భాగంగా ఆరోగ్య సమస్యలతో ఉన్న తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టులో కొంతకాలం క్రితం పిటిషన్​ వేశారు. ముందస్తు బెయిల్​ మంజూరు చేస్తే విచారణకు సహకరిస్తానని న్యాయస్థానానికి తెలిపారు. అయితే, హైకోర్టు ఈ పిటిషన్​ ను కొట్టివేసింది. దాంతో త్వరలోనే సుప్రీం కోర్టులో బెయిల్​ పిటిషన్​ వేయాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. ఇదే కేసులో నిందితునిగా ఉన్న శ్రవణ్​ రావుకు సుప్రీం కోర్టు నాట్​ టు అరెస్ట్​ రక్షణ కల్పించిన నేపథ్యంలో తనకు కూడా ఆ వెసులుబాటు ఇవ్వాలని ఆయన కోరనున్నట్టు తెలిసింది.

 Also Read: Maoist Party: మేము శాంతి చర్చలకు సిద్ధం…కేంద్ర ప్రభుత్వం సిద్ధమేనా? స్పష్టం చేయాలి!

దాంతోపాటు వీలైనంత కాలం తన అరెస్టును వాయిదా వేసేందుకుగాను ప్రభాకర్​ రావు మరో ఎత్తుగడ కూడా వేసినట్టుగా సమాచారం. ఇందులో భాగంగా తనను రాజకీయ శరణార్థిగా పరిగణించాలని ఆయన అమెరికన్​ ప్రభుత్వానికి లిఖిత పూర్వక విజ్ఞప్తి చేసినట్టుగా తెలియవచ్చింది. తాను తెలంగాణ పోలీసు శాఖలో వేర్వేరు హోదాల్లో పని చేసినట్టుగా అందులో తెలిపినట్టు సమాచారం. రాజకీయ కారణాలతోనే తనను ఫోన్​ ట్యాపింగ్​ కేసులో నిందితునిగా చేర్చారని పేర్కొన్నారని తెలియవచ్చింది. అయితే, దీనిపై అమెరికన్​ ప్రభుత్వం ఇంకా స్పందించలేదని తెలిసింది. దీనిపై కేసు దర్యాప్తు చేస్తున్న ఓ అధికారితో మాట్లాడగా సుప్రీం కోర్టు రక్షణ కల్పిస్తే తప్ప ప్రభాకర్​ రావు అరెస్ట్​ ఆగదన్నారు. ఈ నెలాఖరులోపు అతన్ని స్వదేశానికి రప్పిస్తామని చెప్పారు. చూడాలి ఏం జరుగుతుందో…?.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?