Supreme Court
Politics, తెలంగాణ

Supreme Court | నేడు సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విచారణ

Supreme Court | బీఆర్ ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. పది మంది బీఆర్ ఎస్ (brs) ఎమ్మెల్యేలు బీఆర్ ఎస్ ను వీడి కాంగ్రెస్ (congress) లో చేరడంతో వారిపై ఈ కేసు విచారణ జరుగుతోంది. నేడు ఎలాంటి తీర్పు వస్తుందో అని అన్ని పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఎమ్మెల్యేల ఫిరాయింపుతో బీఆర్ ఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అత్యున్నత ధర్మాసనం తమకు అనుకూలంగా తీర్పు ఇస్తుందనే ఆశతో బీఆర్ ఎస్ నేతలు ఉన్నారు.

ఇప్పటికే ఈ కేసుపై విచారణ పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తమకు కూడా వర్తిస్తుందనే ఆశతో బీఆర్ ఎస్ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై వేటు పడేలా చూడాలని బీఆర్ ఎస్ కోరుతోంది.

 

అదే జరిగితే కాంగ్రెస్ కు పెద్ద ఝలక్ ఇచ్చినట్టు అవుతుందని వాళ్లు చూస్తున్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం బీఆర్ ఎస్ తీరును విమర్శిస్తోంది. గతంలో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ ఎస్ లో చేర్చుకున్నప్పుడు ఇదే పని ఎందుకు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. చూడాలి మరి నేడు సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు వెల్లడిస్తుందో.

Just In

01

Ram Charan Next movie: రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా దర్శకుడు ఎవరో తెలిస్తే ఫ్యాన్స్‌కు పండగే..

Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?