Singareni workers: సింగరేణి మెరిట్ స్కాలర్ షిప్ పెంపు.
Singareni workers (imagecredit:twitter)
Telangana News

Singareni workers: సింగరేణి మెరిట్ స్కాలర్ షిప్ పెంపు.. ఉత్తర్వులు జారీ ఎంతంటే!

తెలంగాణ: Singareni workers: ఎంసెట్, నీట్, జేఈఈ మెయిన్స్, ఎయిమ్స్ తదితర కోర్సుల ప్రవేశ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన సింగరేణి కార్మికుల అధికారుల పిల్లలకు ఇప్పటివరకు ఇస్తున్న వార్షిక స్కాలర్ షిప్ మొత్తాన్ని రూ.10 వేల నుంచి రూ.16 వేలకు పెంచుతూ యాజమాన్యం ఉత్తర్వులు జారీచేసింది.

అలాగే కనీస ర్యాంకును 2000 నుంచి 8000 లోపు వరకు పెంచినట్లు స్పష్టంచేసింది. కార్మికుల పిల్లలను ఉన్నత చదువులపై ఆసక్తి పెంచడానికి, ప్రోత్సహించడానికి 1998 లో ఈ స్కాలర్ షిప్ పథకాన్ని ప్రవేశ పెట్టినట్లు తెలిపారు.

2024-25 విద్యాసంవత్సరంలో ప్రవేశ పరీక్షలకు హాజరై ఉత్తమ ర్యాంకులు సాధించిన వారికి వర్తింపజేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు అన్ని ఏరియాల నుంచి జూన్ 15 లోపు దరఖాస్తులు పంపించాలని స్పష్టంచేశారు. ఈ అవకాశాన్ని ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని యాజమాన్యం సూచించింది.

Also Read: UPSC CSE 2024 toppers: సివిల్స్ ఫలితాల్లో తెలుగువారి మార్క్.. మన టాపర్లు వీరే!

Just In

01

Ramchander Rao: బీజేపీ ఆఫీస్ ఎదుట నిరసన తెలిపితే తాట తీస్తాం : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

Kavitha: లేబర్ చట్టాలు అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం : కవిత

Panchayat Elections: ప్రశాంతంగా ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికలు.. మూడు విడత ఎన్నికల్లో 85.77 శాతం పోలింగ్​ నమోదు!

Seethakka: గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలి : మంత్రి సీతక్క

David Reddy: ‘డేవిడ్ రెడ్డి’ గ్లింప్స్ చూశారా?.. మంచు మనోజ్ చెప్పేది వింటే ఏమైపోతారో?