Corruption Case: భారీగా అక్రమాస్తులు కూడబెట్టిన వైనం
ఆదాయానికి మించి ఆస్తులను గుర్తించిన ఏసీబీ
రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డు ఏడీ శ్రీనివాస్ అరెస్ట్
రంగారెడ్డి బ్యూరో, స్వేచ్ఛ: రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డు ఏడీ శ్రీనివాస్ వ్యవహార శైలిపై మొదటి నుంచి వ్యక్తమవుతున్న అనుమానాలే నిజమయ్యాయి. తప్పుడు పనులు చేసేందుకు తాను ఒప్పుకోనుని బహిరంగంగా చెబుతున్నప్పటికీ అంతర్గతంగా పెద్ద అవినీతి అధికారిగా ముద్రపడింది. ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు రంగంలోకి ఏడీ శ్రీనివాస్ నివాసం, కలెక్టరేట్ కార్యాలయం, బంధువుల, స్నేహితులు, బినామీల ఇండ్లపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో విస్తుగొల్పే నిజాలు ఏసీబీ అధికారులు బయటపెట్టారు. ఆదాయానికి మించిన అవినీతికి (Corruption Case) పాల్పడి, వేర్వేరు రాష్ట్రాలలో పెద్ద మొత్తంలో ఆస్తులు సంపాదించినట్లు అధికారులు గుర్తించారు. హైదారాబాద్ అవినీతి నిరోధక శాఖ అధికారులు ఏడీ శ్రీనివాస్పై అక్రమ ఆస్తులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
Read Also- Teenmar Mallanna Office: మల్లన్న ఆఫీస్ ముందు యువకుడి ఆత్మహత్యాయత్నం!.. కారణం ఇదేనా?
కర్ణాటక, ఏపీలో ఆస్తులు
ఏసీబీ అధికారులు గురువారం హైదరాబాద్ రాయదుర్గంలోని మై హోమ్ భుజా అపార్ట్మెంట్స్లో నివాసముంటున్న ఏడీ శ్రీనివాస్ను అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో బంధువులు, మిత్రులు, బినామీల, సహచరులకు చెందిన 6 ప్రదేశాల్లో కూడా ఏసీబీ సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రాయదుర్గంలోని మైహెమ్ భుజాలోని ఒక ప్లాట్, నారాయణపేట్ జిల్లాలోని రైస్ మిల్లు, కర్ణాటక రాష్ట్రంలో 11 ఎకరాలు, ఏపీలోని అనంతపూర్లో 11 ఎకరాల వ్యవసాయ భూమి, మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో 4 ప్లాట్లు, నారాయణపేట్ జిల్లాలో 3 ప్లాట్లకు సంబంధించిన పత్రాలను అధికారులు గుర్తించారు. అదేవిధంగా, 1.6 కిలోల బంగారు అభరణాలు, దాదాపు 770 గ్రాముల బరువున్న వెండి వస్తువులు, రూ.5 లక్షల నగదు, ఒక కియో సెల్టోస్ హైక్రాస్, ఒక ఇన్నోవా కారు గుర్తించారు. ఈ స్థిర, చరాస్థుల మార్కెట్ విలువ, డాక్యుమెంట్ విలువ కంటే అనేక రెట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Read Also- Big Ticket Abu Dhabi: సౌదీలోని భారతీయుడికి భారీ జాక్పాట్.. లాటరీలో రూ.61 కోట్లు!
లంచగొండుల అడ్డగా రంగారెడ్డి!
అక్రమ ఆస్తుల సంపాదనకు రంగారెడ్డి జిల్లా అధికారులకు అడ్డగా మారిపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతీకాలంలోనే, అవినీతి అధికారులపై నిఘా పెట్టడంతో ఎక్కడాలేని విధంగా రంగారెడ్డి జిల్లాలోనే అత్యధిక మంది ప్రభుత్వ ఉద్యోగులు ఏసీబీకి పట్టుబడ్డారు. ప్రధానంగా రెవెన్యూ, విద్యుత్ శాఖ, పంచాయితీ, టౌన్ ప్లానింగ్ విభాగాల్లోనే అవినీతి ఎరులై పారుతుందని ఏసీబీ దాడులతో స్పష్టమైతుంది. మొడిపండు చూడు మేలిమై ఉండును పొట్ట విప్పు చూడు పురుగులుండును అనే చందంగా అధికారుల వ్యవహారం ఉంటుంది.
