Polling Staff Protest: భోజనం దొరకక ఎన్నికల సిబ్బంది నిరసన
Polling Staff Protest (imagecredit:swetcha)
Telangana News

Polling Staff Protest: మధ్యాహ్న భోజనం దొరకక ఎన్నికల పోలింగ్ సిబ్బంది నిరసన

Polling Staff Protest: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ పరిధిలో మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికలు బుధవారం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఖేడ్ డివిజన్లోని 7 మండలాలకు చెందిన 196 గ్రామపంచాయతీల పోలింగ్ సిబ్బందికి మంగళవారం నారాయణఖేడ్ డిగ్రీ కళాశాల(Narayankhed Degree College) ఆవరణలో మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేశారు. అయితే మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా సగానికి పైగా పోలింగ్ సిబ్బందికి భోజనం అందకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. దీంతో ప్లేట్లు చేతబట్టి పోలింగ్ సిబ్బంది నిరసనకు దిగారు. ఎన్నికల ఏర్పాట్లలో అధికారుల నిర్లక్ష్యమే ఈ పరిస్థితికి కారణమని వారు ఆరోపించారు.

Also Read: UN Security Council: స్నేహంతో సింధూ నీరు ఇస్తే.. యుద్ధాలు, ఉగ్రదాడులు తిరిగిచ్చింది.. పాక్‌పై భారత్ ఫైర్

పోలింగ్ సిబ్బంది ఆవేదన

డ్యూటీకి రాకపోతే షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరిస్తారని, కానీ విధులకు హాజరైన సిబ్బందికి కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడం అన్యాయమని పోలింగ్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. డ్యూటీకి రాకపోతే ఒక రకమైన ఒత్తిడి, వస్తే సరైన భోజనం కూడా లేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఇంతటి కీలక ఎన్నికల సమయంలో ఇలాంటి నిర్లక్ష్యం సరికాదని, తక్షణమే అధికారులు స్పందించి సిబ్బందికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని పోలింగ్ సిబ్బంది డిమాండ్ చేశారు.

Also Read: Medak District: స్టీల్ పరిశ్రమలో భారీ పేలుడు.. ఒకరు మృతి, నలుగురికి గాయాలు!

Just In

01

Panchayat Elections: తుది అంకానికి పంచాయతీ పోరు.. 3వ విడత పోలింగ్‌కి సర్వం సిద్దం!

Urea Production: కేంద్రం అలా చేస్తే రైతులకు ఎరువులు.. మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు

Errolla Srinivas: రాష్ట్రంలో పోలీసు శాఖలో అసమర్థులకు కీలక పదవులు.. అందుకే గన్ కల్చర్..!

Minister Sridhar Babu: బుగ్గపాడులో మౌలిక వసతులు పూర్తి చేయాలి: మంత్రి శ్రీధర్ బాబు

KTR: పంచాయతీ నిధులు, ఇందిరమ్మ ఇండ్లు మీ అబ్బ సొత్తు కాదు: కేటీఆర్