తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Ganja Seized: విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు వేర్వేరు చోట్ల దాడులు నిర్వహించిన ఎక్సయిజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ బృందాలు నిందితులను అరెస్ట్ చేసి 15 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎక్సయిజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ వీ.బీ.కమలాసన్ రెడ్డి తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. శంషాబాద్ ప్రాంతంలో గంజాయి అమ్మకాలు జరుగుతున్నట్టు తెలిసి స్టేట్ టాస్క్ ఫోర్స్ ఏ టీం సీఐ నంధ్యాల అంజిరెడ్డి ఆధ్వర్యంలో దాడి చేసిన సిబ్బంది మహ్మద్ చాంద్, మహ్మద్ రియాజ్ లను అరెస్ట్ చేశారు.
Also Read: SLBC Tunnel Rescue Operations: ఎస్ఎల్బీసీ సహాయక చర్యల్లో కీలక పురోగతి.. పెద్ద సమస్య తీరినట్లే!
వీరి నుంచి 2.8 కిలోల గంజాయిని సీజ్ చేశారు. నిందితులపై కేసులు నమోదు చేసి శంషాబాద్ ఎక్సయిజ్ పోలీసులకు అప్పగించారు. ఇక, శేరిలింగంపల్లి, చందానగర్ ప్రాంతాల్లో కొందరు గంజాయి అమ్మటానికి ప్రయత్నిస్తున్నట్టు తెలిసి సీఐ నంధ్కాల అంజిరెడ్డి, ఎస్సై బాలరాజుతోపాటు సిబ్బందితో కలిసి దాడి చేశారు. మహారాష్ర్ట నుంచి గంజాయి తెచ్చి ఇక్కడ విక్రయించటానికి యత్నించిన దుర్గప్రసాద్, అయూబ్, మాధవన్, సిద్దిఖీ, ఇష్రాన్, నవీన్ కుమార్ లను అరెస్ట్ చేసి 1.2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
Also Read: Fine Rice Distribution: ఉగాది నాడు గుడ్ న్యూస్.. సన్న బియ్యం పంపిణీ ప్రారంభం.. సీఎం రేవంత్ రెడ్డి
రంగారెడ్డి డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆర్.కిషన్ నేతృత్వంలో సిబ్బంది సరూర్ నగర్ ప్రాంతంలో ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి ఒక కిలో గంజాయిని సీజ్ చేశారు. ఇక, ఎక్సయిజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు, రైల్వే పోలీసులు కలిసి శనివారం సంయుక్తంగా రైళ్లలో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో రైలు బోగీ సీటు కింద దాచి పెట్టి ఉన్న 10కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈ గంజాయిని దాచి పెట్టింది ఎవరన్నది తెలియరాలేదు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు