తెలంగాణ: Kaleshwaram project: అక్రమాస్తుల కేసులో అరెస్ట్ చేసిన కాళేశ్వరం ఈఎన్సీ హరీరాంను పోలీసులు చెంచల్ గూడ జైలుకు తరలించారు. మార్కెట్ రేటు ప్రకారం చూస్తే ఇప్పటికే గుర్తించిన ఆస్తుల విలువ 5వందల కోట్లకు పైగానే ఉంటుందని ఏసీబీ వర్గాలు తెలిపాయి. హరీరాం ఆయన కుటుంబ సభ్యుల పేరున ఉన్న మూడు బ్యాంక్ లాకర్లను తెరవాల్సి ఉందని పేర్కొన్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టులో పలు లోటుపాట్లు ఉన్నాయంటూ ఎన్డీఎస్ఏ రిపోర్టు ఇచ్చిన కొన్ని గంటల్లోనే ఏసీబీ అధికారులు షేక్ పేటలోని హరీరాం నివాసంపై దాడులు జరిపిన విషయం తెలిసిందే. దాంతోపాటు హరీరాం బంధువులు, సన్నిహితుల ఇళ్ల్లల్లో కూడా సోదాలు జరిపారు. ఈ క్రమంలో షేక్ పేట, కొండాపూర్ లలో రెండు విల్లాలు, శ్రీనగర్ కాలనీ, మాదాపూర్, నార్సింగిలలో ఫ్లాట్లు, అమరావతిలో వాణిజ్య స్థలం హరీరాం ఆయన కుటుంబ సభ్యుల పేరన ఉన్నట్టు ఏసీబీ అధికారులు నిర్ధారించుకున్నారు.
Also Read: CM Revanth Reddy Tweet: లక్ష్యం ఇదేనంటూ.. సీఎం రేవంత్ భావోద్వేగ ట్వీట్..
దాంతోపాటు మర్కూక్ మండలంలో 28 ఎకరాల వ్యవసాయ భూములు, పటాన్ చెరులో 20 గుంటల భూమి ఉన్నట్టు సోదాల్లో వెల్లడైంది. శ్రీనగర్ కాలనీలో ఓ ఇల్లు కూడా ఉన్నట్టు తెలిసింది. బొమ్మలరామారాంలో ఆరు ఎకరాల మామిడితోట, ఫార్మ్ హౌస్ ఉన్నట్టుగా వెల్లడైంది. కొత్తగూడెంలో ఓ ఇల్లు కట్టిస్తున్నట్టు తెలిసింది.
ఇక, కుత్భుల్లాపూర్, మిర్యాలగూడలో రెండు ప్లాట్లు, బీఎండబ్ల్యు కారు, రెండు ద్విచక్ర వాహనాలు, పెద్ద ఎత్తున బంగారు నగలు ఉన్నట్టుగా తేలింది. ఈ ఆస్తులకు సంబంధించిన వాటితోపాటు బ్యాంక్ డిపాజిట్ల పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్టుగా స్పష్టం కావటంతో ఆయనపై కేసులు నమోదు చేశారు. జడ్జి 14 రోజుల రిమాండ్ విధించటంతో చెంచల్ గూడ జైలుకు తరలించారు.
Also Read: minister seethakka: మహిళా సంఘాల సక్సెస్ స్టోరీలకు పుస్తక రూపం ఇవ్వాలి.. మంత్రి సీతక్క !