TG Electricity Charges: రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెంచబోమని ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ స్పష్టం చేసింది. విద్యుత్ సంస్థలు ప్రతిపాదించిన అగ్రిగేట్ రెవిన్యూ రిక్వైర్మెంట్ (ఏఆర్ఆర్)పై ఇప్పటికే బహిరంగ విచారణ పూర్తి చేశారు. విద్యుత్ పంపిణీ సంస్థలు ఎదుర్కొనే లోటును రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడంతో దీంతో వినియోగదారులపై భారం తప్పినట్లయింది.
ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున్ పవర్ టారీఫ్ వివరాలను మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలోని 1కోటి 90లక్షల వినియోగదారులు ఉండగా అగ్రికల్చర్ సెక్టార్లో 1కోటి 37లక్షల గృహవినియోగదారులు , 29.15లక్షల అగ్రికల్చర్ కనెక్షన్లు , 19.89లక్షల కమర్షియల్ కనెక్షన్లు ఉన్నాయని మరో నాలుగున్నర లక్షల వరకు ఇండస్ట్రియల్ కనెక్షన్లు ఉన్నట్లు చెప్పారు.
వీటిల్లో ఏ సెక్టార్లో పవర్ టారీఫ్ పెంచడం ఉండదని జస్టిస్ నాగార్జున్ స్పష్టం చేశారు. విద్యుత్ పంపిణీ సంస్థలు 2025-26 వార్షిక ఆదాయ అవసరాల నివేదికల్లో రూ.65849.74కోట్లు ప్రతిపాదించింది.
ఈ ప్రతిపాదనలపై ఈఆర్సీ బహిరంగ విచారణ చేసి రూ.58628.09కోట్లకు ఆమోదం తెలిపింది. అయితే డిస్కంలకు విద్యుత్ ఛార్జీల ద్వారా రూ.45710.05కోట్ల ఆదాయం చేకూరనుంది.
Also read: YS Sharmila: షర్మిల ఇంటి వద్ద హై టెన్షన్.. భారీగా పోలీసుల మోహరింపు..
విద్యుత్ సంస్థలు రూ.13499.41కోట్లు లోటును ఎదుర్కొంటున్నాయి. అయితే రాష్ట్ర సర్కారు లోటును భరించడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఈఆర్సీకి రాతపూర్వంగా సమర్పించింది.
దీంతో రాష్ట్ర ప్రజలపై విద్యుత్ చార్జీల భారం తప్పినట్లయింది.
ఈ నేపథ్యంలో టారీఫ్ పెంచకుండానే కొత్త టారీఫ్ను ప్రకటించింది. ఇదిలావుండగా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్మీషన్ ఛార్జీలు ట్రూడౌన్ రూ.685.78కోట్లు, ట్రాన్స్మీషన్ ట్రూడౌన్ రూ.1608కోట్లు ఉందని, ఇలా అన్ని కలిపి ఏఆర్ఆర్ అంచనాల్లో కోత విధించినట్లు ఈఆర్సీ వెల్లడిచింది. కాగా ఎలక్ట్రిక్ వెయికిల్స్ ఛార్జింగ్ స్టేషన్ కాంటాక్ట్ లోడ్ను 58కివాట్ పర్ 75హెచ్పి నుంచి 150కిలోవాట్ పర్ 201హెచ్పీకి విస్తరించింది.
గ్రిడ్ సపోర్ట్ ఛార్జీలు నెలకు రూ.20.04కిలోవాట్ గా డిస్కంలు ప్రతిపాదించగా ఈఆర్సీ నెలకు రూ.18.48కిలోవాట్కు అనుమతించింది. 2014 నుంచి డిస్కంల ఆర్థిక పరిస్థితి బాగలేదని జస్టిస్ నాగార్జున్ అన్నారు. ప్రభుత్వాలు డిస్కంలకు స్వతంత్రం ఇవ్వలేదన్నారు. ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గించుకోవాలని సూచించారు.