Municipal Elections: అన్నా మా వార్డు ఏ రిజర్వేషన్ అవుతుంది, నేను పోటీ చేయాలా, వద్దా…అని ఆశవాహ అభ్యర్థుల ఆందోళన ఒకవైపు…, తమ వార్డు ఏ కులానికి రిజర్వుతుందో, ఎవరు పోటీ చేస్తారో అనే ఉత్కంఠ ఓటర్లది మరోవైపు. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కార్యరూపం దాల్చడంతో పురపాలికల్లో ప్రస్తుత పరిస్థితులు ఆసక్తిని రేకిస్తున్నాయి.
రిజర్వేషన్లపై ఉత్కంఠ…!
మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు ప రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం సిద్ధం కానుండటంతో పురపాలికల్లో రాజకీయాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఓటర్ల జాబితా ప్రచురించడంతో మార్పులు చేర్పులు కొనసాగాయి. దీంతో ఇప్పటికే నోటిఫికేషన్ వస్తుందనుకున్న ఆశావాహ అభ్యర్థుల్లో ఆ ప్రక్రియ కావడంతో గుబులు కలిగిస్తోంది. ఇప్పటివరకు ఉన్న వార్డులు ఏ రిజర్వేషన్ కిందకు వస్తాయో అనే సందేహాలు నెలకొన్నాయి. ఇప్పటివరకు కౌన్సిలర్లుగా ఉన్న తాజా మాజీలతోపాటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బిజెపిలాంటి పార్టీల అభ్యర్థులు ఎన్నికల నోటిఫికేషన్ కోసం గత వారం రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు యధావిధిగా కొనసాగుతాయనే అంచనాలు వేస్తూనే, కులగణన ప్రకారం వార్డుల రిజర్వేషన్లు మారవచ్చనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో ఇప్పటివరకు ఆయా వార్డులో పోటీ చేస్తామని ఆశలు పెట్టుకున్న నాయకులు తమ భవిష్యత్తు ఏమవుతుందనే ఆందోళనలో పడిపోయారు.
Also Read: Seethakka Meets KCR: మాజీ సీఎం కేసీఆర్ను కలిసి మంత్రులు సీతక్క, కొండా సురేఖ.. కారణం ఏంటంటే?
నోటిఫికేషన్ వస్తేనే తమకు ఓ అంచనా..
ఇప్పటివరకు తాము చేసిన అభివృద్ధితో మళ్లీ గెలుస్తామని తాజా మాజీ కౌన్సిలర్లు ధీమాలో ఉండగా, ఒకవేళ రిజర్వేషన్లు మారిస్తే తమ రాజకీయ భవిష్యత్తు ఏంటనే చర్చలు చేస్తున్నారు. దీంతోపాటు చైర్మన్ ఏ వర్గానికి రిజర్వ్ అవుతుందోననే చర్చలు మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలో, ప్రజల్లో జరుగుతున్నాయి. ఇప్పటికే ఆర్థికంగా బలపడ్డ పలువురు నాయకులు ఛైర్మన్ పీఠం కోసం ఆశలు పెట్టుకున్నారు. ఆయా పార్టీల ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో తమకు రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చేలా చూడాలంటూ కాంగ్రెస్ ఆశావాహులు ప్రయత్నిస్తుండగా బీఆర్ఎస్ అభ్యర్థులు నోటిఫికేషన్ వస్తేనే తమకు ఓ అంచనా ఏర్పడుతుందనే భావనలో ఉన్నారు. ఇది ఇలా ఉంటే ఓ వార్డు ఎస్టికి రిజర్వు అవుతుందని, మరో వార్డు బీసీకి రిజర్వు అవుతుందనే ఊహాగానాలు రావడం కూడా అభ్యర్థులను గందరగోళానికి గురిచేస్తోంది. దీంతో ఏ వార్డు ఏ కులానికి రిజర్వుతుందో అనే ఉత్కంఠ రోజురోజుకు పెరిగిపోతుంది. ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పటికే వెలువడుతుందని ఆశలో నాయకులు ఉండగా అది రాబోయే సంక్రాంతి పండుగ తర్వాతే రావచ్చనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వార్డుల రిజర్వేషన్లు, ఎన్నికల నోటిఫికేషన్ కోసం నాయకులు, మున్సిపల్ అధికారులు, సిబ్బందిని ఆయా పార్టీల ముఖ్య నాయకులను అడుగుతూ ఆశావహులు ఎదురుచూపులు చూస్తున్నారు.
Also Read: Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల వివాదం.. టీటీడీ ఛైర్మన్పై భూమన సంచలన ఆరోపణలు

