Thummala Nageswara Rao: కొనుగోలు బాధ్యత కేంద్రానిది కాదా?
Thummala Nageswara Rao (image credit: swetcha reporter)
Telangana News

Thummala Nageswara Rao: పత్తి కొనుగోలు బాధ్యత కేంద్రానిది కాదా?.. కేంద్ర ప్రభుత్వంపై మండిపడిన మంత్రి తుమ్మల

Thummala Nageswara Raoపత్తి కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అసంబద్ధమైన విధానాలపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పత్తి కొనుగోలు చేయాల్సిన బాధ్యత పూర్తిగా కేంద్రానిది కాదా? అని ప్రశ్నిస్తూ, అమలుకు సాధ్యం కాని షరతులు, నిబంధనలు పెట్టి రైతులను ఎందుకు అరిగోస పెడుతున్నారని నిలదీశారు. మీడియా ప్రకటన విడుదల చేస్తూ ఆయన కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించారు.

జిన్నింగ్ మిల్లుల ఎంపిక, కొనుగోళ్ల పరిమితులపై మంత్రి ఘాటుగా స్పందించారు. ‘జిన్నింగ్ మిల్స్‌లో 100 వరకు ప్రొక్యూర్మెంట్ ఎక్విప్‌మెంట్ లేదంటున్నారు. మరి జిన్నింగ్ మిల్లులు నోటిఫై చేసింది ఎవరు? మీరు కాదా? ఎకరానికి 5 క్వింటాళ్ల నుంచి 18 క్వింటాళ్ల వరకు దిగుబడులు రాష్ట్రంలో నమోదు అవుతుంటే, 7 క్వింటాళ్ల పరిమితి పెట్టడానికి సాంకేతిక ఆధారం ఏమిటి? 7 క్వింటాళ్ల కంటే అధికంగా పండించిన రైతు మిగతా పంటను ఎక్కడ అమ్ముకోవాలి?’ అని కేంద్రాన్ని తుమ్మల నిలదీశారు.

మానవతా దృక్పథం లేదా?

పత్తి కొనుగోళ్లలో రాష్ట్రానికి సంబంధం లేకున్నా, కేంద్రం తీసుకున్న నిర్ణయాల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని, జిన్నింగ్ మిల్స్ సమ్మె అంటే రైతులు మరింత కష్టాలకు గురి అవుతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలను సానుకూలంగా పరిష్కరించడానికి తమ ప్రభుత్వం ఆలోచిస్తుంటే, దానిని కూడా రాజకీయం చేయాలని చూడటం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. తేమ శాతంపై దేశవ్యాప్తంగా ఒకే పాలసీ ఉన్నప్పటికీ, రాష్ట్రంలో వాతావరణ అనిశ్చితి, అకాల వర్షాలు, మొంథా తుఫాను ప్రభావంతో రైతులు ఇబ్బందులు పడ్డారని మంత్రి గుర్తుచేశారు. ‘మానవతా దృక్పథంతో మీ పాలసీ కన్నా ఎక్కువ తేమ శాతం ఉన్న పత్తిని కూడా కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున అనేక సార్లు విజ్ఞప్తి చేసినా, కనీస స్పందన లేదు’ అని మంత్రి మండిపడ్డారు. రైతులపై కపట ప్రేమను చూపుతున్న కేంద్రం ఈ విషయంలో ఎందుకు సానుకూల నిర్ణయం తీసుకోలేదని ప్రశ్నించారు.

కొనుగోళ్ల భారం రాష్ట్రాలపై నెట్టొద్దు

పత్తి కొనుగోళ్ల భారాన్ని రాష్ట్రాలపై నెట్టివేసేలా కేంద్రం నిర్ణయాలు ఉన్నాయన్నది నిజం కాదా? అని మంత్రి నిలదీశారు. అసలు పత్తి పంటను కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిది కాదా? అని పునరుద్ఘాటించారు. సీసీఐపై దుష్ప్రచారం చేయాల్సిన పరిస్థితి తమ ప్రభుత్వానికి అవసరం లేదన్నారు. పంజాబ్, రాజస్థాన్, కర్ణాటక, ఏపీలో కూడా కేంద్రం పెట్టిన కొనుగోలు పరిమితులపై వ్యతిరేకత వచ్చిందని గుర్తు చేశారు. దిగుబడి వచ్చిన మొత్తం పత్తిని ప్రధాని కొనాలని ఆదేశించినప్పుడు, రైతులను ఇబ్బందులకు గురిచేసే నిబంధనలు ఎందుకు పెడుతున్నారని తీవ్రస్థాయిలో ప్రశ్నించారు.

Also Read: Thummala Nageswara Rao: ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో నిలువాలి.. అధికారులను ఆదేశించిన మంత్రి తుమ్మ

రాష్ట్రంలో ఏకకాలంలో 25,36,000 రైతులకు రూ.2 లక్షల వరకు ఉన్న రుణాలను ఏకకాలంలోనే మా ప్రజా ప్రభుత్వం మాఫీ చేసిందని, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్రంలోనైనా ఇది జరిగిందా? అని తుమ్మల ప్రశ్నించారు. నాఫెడ్ ద్వారా చేసే సోయాబీన్ కొనుగోళ్లలో ఆధార్ అథెంటికేషన్ పెట్టి కౌలు రైతులకు అన్యాయం చేస్తున్నది కేంద్రమేనని ఆరోపించారు. అయినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం మొబైల్ ఓటీపీ సదుపాయం తీసుకొచ్చి కొనుగోళ్లు చేస్తున్న విషయం గుర్తు చేశారు.

Also Read: Thummala Nageswara Rao: పత్తిలో తేమ 12 శాతం ఉన్నా కొనుగోలు చేయాలి.. సీసీఐ సీఎండీ కి మంత్రి తుమ్మల విజ్ఞప్తి

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?