Excise Police Stations (imagecredit:twitter)
తెలంగాణ

Excise Police Stations: రాష్ట్రంలో కొత్తగా మరో 14 ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు

Excise Police Stations: రాష్ట్రంలో కొత్తగా 14 ఎక్సయిజ్ పోలీస్ స్టేషన్లు(Excise Police Stations) ఏర్పాటయ్యాయి. ఈనెల 28న ఎక్సయిజ్​శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishnarao) వీటిని ప్రారంభించనున్నారు. హైదరాబాద్(Hydrabad)​, రంగారెడ్డి(Ranga Reddy) డివిజన్లలో 12 స్టేషన్లు ప్రారంభం కానుండగా మెదక్(Medak)​, వరంగల్ డివిజన్లలో ఒక్కో స్టేషన్ అందుబాటులోకి రానున్నాయి. 2020లో ఈ కొత్త ఎక్సయిజ్​ పోలీస్​స్టేషన్ల ఏర్పాటుకు ఆ శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించారు. వీటికి ప్రభుత్వ ఆమోదం లభించటంతో ఈనెల 28నుంచి కొత్త స్టేషన్లు పని చేసేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ప్రస్తుతం ఉన్న ఎక్సయిజ్​స్టేషన్లలోనే ఏర్పాటు

దీని కోసం అద్దె భవనాలను గుర్తించాలని సూచించారు. ఈ క్రమంలో బంజారాహిల్స్, చిక్కడపల్లి, గండిపేట, కొండాపూర్​, పెద్ద అంబర్​పేట, కూకట్​పల్లి, అమీన్​పూర్, హసన్​పర్తి ఎక్సయిజ్ స్టేషన్ల కోసం అద్దె భవనాలను గుర్తించారు. మారేడ్ పల్లి, మీర్​పేట, కొంపల్లి, కాప్రా, నాచారం, అల్వాల్ స్టేషన్లను ప్రస్తుతం ఉన్న ఎక్సయిజ్​స్టేషన్లలోనే ఏర్పాటు చేయనున్నారు. పాత ఎక్సయిజ్ స్టేషన్ల స్టేషన్ హౌస్ ఆఫీసర్లే కొత్తవాటికి కూడా బాధ్యత వహిస్తారు. కొన్ని స్టేషన్లకు సీనియర్ ఎస్సైలను ఎస్​హెచ్​వోలుగా నియమించే అవకాశాలు ఉన్నాయి. కొత్తగా పని చేయనున్న స్టేషన్లకు కేసులు, స్వాధీనం చేసుకున్న సొత్తును బదలాయించనున్నారు.

Also Read: Commercial Flat: గచ్చిబౌలిలో రికార్డ్ ధరలు.. రూ.65.02 కోట్ల మేర ఆదాయం!

పరిధుల విభజన

కొత్త ఎక్సయిజ్​స్టేషన్లు పని చేయనున్న నేపథ్యంలో పాత స్టేషన్ల పరిధులను విభజించి ఆయా ప్రాంతాలను వీటికి కేటాయించారు. సికింద్రాబాద్ ఎక్సయిజ్​ స్టేషన్(Secunderabad Excise Station) పరిధిలో కొత్తగా మారేడ్​పల్లి, చిక్కడపల్లి స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. శంషాబాద్​స్టేషన్ పరిధిలో కొత్తగా గండిపేట, కొండాపూర్ స్టేషన్లు ఏర్పాటయ్యాయి. సరూర్​నగర్​స్టేషన్ పరిధిలో మీర్ పేట స్టేషన్ మొదలు కానుంది. మేడ్చల్(Medchel)​ స్టేషన్​ను విభజించి కొంపల్లి, కూకట్ పల్లి(Kukat Pally) స్టేషన్లను ఏర్పాటు చేశారు. మల్కాజిగిరి స్టేషన్ పరిధులను విభజించి కాప్రా, నాచారం, అల్వాల్ స్టేషన్లను అందుబాటులోకి తెచ్చారు. సంగారెడ్డి(Sanga Reddy) ఎక్పయిజ్ స్టేషన్ పరిధులను విభజించి అమీన్​పూర్, వరంగల్​అర్భన్ ఎక్సయిజ్​స్టేషన్ ను విభజించి హసన్​పర్తి స్టేషన్​ను ఏర్పాటు చేశారు.

Also Read: Bike Robbery: వాటికి బానిసై.. బైక్ దొంగలుగా మారిన యువకులు

 

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు