Jupally Krishna Rao: మాదకద్రవ్యాల నివారణ అందరి బాధ్యత
Jupally Krishna Rao (imagecredit:swetcha)
Telangana News

Jupally Krishna Rao: మాదకద్రవ్యాల నివారణ అందరి బాధ్యత: మంత్రి జూపల్లి కృష్ణారావు

Jupally Krishna Rao: యువత జీవితాలకు ప్రమాదకరంగా మారిన మాదకద్రవ్యాల నివారణ సమాజంలో అందరి బాధ్యత అని మంత్రి జూపల్లి కృష్ణ రావు(Min Jupally Krishna Rao) అన్నారు. హైదరాబాద్(Hyderabad), హిమాయత్ నగర్(Himayath Nagar), మఖ్డూమ్ భవన్, రాజ్ బహదూర్ గౌర్ హాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజానాట్య మండలి నిర్వహించిన మాదకద్రవ్యాల వల్ల కలిగే ప్రమాదాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు కళారూపాల వర్కుషాప్ ను గురువారం మంత్రి ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ మాదకద్రవ్య దుర్వినియోగం యొక్క హానికరమైన ప్రభావాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా ఈ సమస్యను ఎదుర్కోవడంలో కళాకారులూ కీలక పాత్ర పోషించాలన్నారు.

ప్రజానాట్య మండలి కళాకారులు

కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను అన్ని వసతులు, సౌకర్యాలతో నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నామని తెలిపారు. దీనిపై ప్రజల్లో చైతన్యం కల్పించే దిశగా విధినాటకాలను, కళారూపాలను ప్రదర్శించాలని తెలంగాణ ప్రజానాట్య మండలి కళాకారులకు సూచించారు. ప్రజలకు మెరుగైన వైద్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని, ప్రభుత్వ వైద్యం పై ముఖ్యమంత్రి రేవంత రెడ్డి(CM Revanth Reddy) ప్రత్యేక ద్రుష్టి కేంద్రీకరించారన్నారు. ప్రజలు ప్రైవేట్(Private), కార్పొరేట్(Carporate) ఆసుపత్రులకు వెళ్లి అప్పులపాలు కావద్దని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందాలని కోరారు.

Also Read: Harikatha: ‘హరికథ’కు మంత్రి వాకిటి శ్రీహరి సపోర్ట్.. ఏం చేశారంటే?

ఎంజాయ్ పేరుతో గంజాయి వద్దురా!

అంతకు ముందు ప్రజానాట్య మండలి కళాకారులూ ప్రదర్శించిన ఎంజాయ్ పేరుతో గంజాయి వద్దురా! మరియు కార్పొరేట్ వద్దురా ప్రభుత్వ ఆసుపత్రులు ముద్దురా ! అనే విధి నాటకాలను మంత్రి తిలకించి అభినందించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం(MLC Nellikanthi Satyam), సీపీఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి నరసింహ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేణి శంకర్, ఛాయాదేవి, మరుపాక అనిల్ కుమార్, స్టాలిన్, ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు కె. శ్రీనివాస్, లక్ష్మి నారాయణ కళాకారులు పాల్గొన్నారు.

Also Read: Shocking News: చనిపోయాడని అంత్యక్రియలు నిర్వహిస్తే..16 ఏళ్ల తర్వాత ఇంటికి తిరిగొచ్చాడు!

Just In

01

Actor Sivaji: నటుడు శివాజీపై మహిళా కమిషన్​ సీరియస్.. చర్యలు తప్పవ్!

Aadi Sai Kumar: ‘శంబాల’ ఉందా? లేదా? అనేది తెలీదు కానీ, ‘కల్కీ’ తర్వాత ఆ పేరు వైరలైంది

AP CM Chandrababu Naidu: ఏపీ నుంచి ఎవరైనా నోబెల్ సాధిస్తే.. వారికి రూ. 100 కోట్లు ఇస్తా! మళ్లీ అదే సవాల్!

Ramchander Rao: ఇరిగేషన్ ప్రాజెక్టులపై అధ్యయన కమిటీ వేస్తాం : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

Uttam Kumar Reddy: పదేళ్లలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేశారా? తీవ్రస్థాయిలో మండిపడ్డ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి!